....

Footer Right Content

Friday, December 31, 2010

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

గడిచిపోతున్న ఏడాదికి వీడ్కోలు పలుకుతూ వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతాలు చెబుతూ డిసెంబరు 31న వేడుకలు చేసుకోవడం పరిపాటి. నేటి సంబరాలకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధమౌతున్నారు. వారం ముందునుంచే వేడుకలకు ప్రణాళిక వేసుకునేవారూ ఉన్నారు. ఏడాది చివరి రోజు స్మృతిగా మిగిలిపోవాలని అనుకుంటారు. ఆ

Saturday, December 18, 2010

ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వినియోగం పెరగాలి : ఎన్‌సిఎఆర్‌ 2010 పిలుపు

సామాన్యుల చెంతకు టెక్నాలజీ తీసుకెళ్లడానికి మహోద్యమం చేయాలని జాతీయ అకడమిక్‌, రీసెర్చ్‌ సదస్సు(ఎన్‌సిఎఆర్‌) పిలుపునిచ్చింది. బోధనా, పరిశోధనల్లో ఫ్రీసాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, సమాజ ఉపయోగ పరిశోధనల కోసం విద్యావేత్తలు, పరిశోధకుల మధ్య సంబంధాలు మరింత పెరగాలని సదస్సు సూచించింది. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన జాతీయ సదస్సు ఈ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ పిలుపునిచ్చింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 550 మంది విద్యావేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు. విద్య,

Thursday, December 9, 2010

చేతికందాల్సిన పంటలు చేజారిపోయాయి

చేతికందాల్సిన  పంటలు చేజారిపోయాయి. సార్వాలో నాలుగుసార్లు ఏర్పడిన అల్పపీడనాలు పంట పొలాలను తుడిచి పెట్టేశాయి. లైలా తుపాను పరిహారమే ఇంతవరకూ రాలేదు. పలు జిల్లాలో నష్టం కోట్లలో  ఉంటుందని అంచనా.  అయితే అధికారిక అంచనాలు అందులో నాలుగో వంతు కూడా లేదు. వేలాది ఎకరాల్లో వరి పైర్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశలోనే నాశనమైంది. కొంత పొట్టమీదున్న పైరూ నీటమునిగింది. చెరువులకింద వరి సాగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓదెలు నీటమునిగాయి.

మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాఫ్ట్వేర్‌ తోడ్పాటు

  • సదస్సులో వక్తల ఆకాంక్ష
  • సహజ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్‌ రంగం
  • 16 నుండి జాతీయ కన్వెన్షన్‌
ఇంటర్‌నెట్‌ పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాప్ట్‌వేర్‌ తోడ్పాడాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. గురువారం

Wednesday, November 24, 2010

‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి

ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి కావడం లేదా వారికిష్టమైనవారిని  రుద్దడం అనేది  కాంగ్రెస్ సంస్కృతి అనేది జగమెరిగిన సత్యం. ఈమధ్యనే మహారాష్ట్రలో  కేంద్రమంత్రిగా వున్న ఫృథ్విరాజ్ చవాన్ ను దిగుమతి చేయడం తెలిసిందే. నేడు ఆంధ్రపదేశ్లోనూ అదే తరహా వ్యూహం అయితే జరిగింది. చివరి నిమిషంలో జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు కానీ లేకపోతే ఇక్కడ కూడా అదే తరహా దిగుమతి జరిగేది. మరోరకమైన విధానం ఏమంటే- ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా  ‘ఏకవాక్య తీర్మానం’పేరుతో కాసేపు రాజకీయ డ్రామా నడిపి, ముందుగానే నిర్ణయించబడిన వ్యక్తి పేరు ప్రకటించడం ఆనవాయితీ. అదే ప్రస్తుతం జరిగింది. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ గడువు వుంది. ఈలోపు మళ్ళీ ఇటువంటి కథే పునరావృతకం కాకుండా వుంటే మంచిది.
కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ గందరగోళం వల్ల రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు, ఉద్యోగులు,  విద్యార్థులు, సామాన్యప్రజానీకం తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించే నాయకుడు అవసరం. ఈ సమస్యలను కొత్త నాయకుడైనా పరిష్కరించే ప్రయత్నమైనా చేస్తాడేమో చూద్దాం...

Sunday, November 14, 2010

సినీ భీష్ముడు... డీవీఎస్‌ రాజు

 తెలుగు చిత్రసీమకు భీష్మాచార్యుడుగా ప్రశంసలందుకొన్న రాజు భౌతికంగా  దూరమైనా... ఆయన నిర్మించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. డీవీఎస్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన 'మంగమ్మ శపథం', 'తిక్క శంకరయ్య', 'జీవన జ్యోతి' లాంటి చిత్రాల్ని సినీ ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. కథను నమ్మిన నిర్మాత ఆయన. ఇటీవలి కాలంలో మారిపోయిన సినీ వ్యాపారాన్ని గమనిస్తూ... నిర్మాణానికి దూరంగానే ఉండిపోయారు. కేవలం తన
చిత్రాల నిర్మాణానికే డీవీఎస్‌ రాజు పరిమితం కాలేదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

Thursday, November 11, 2010

బ్రౌన్ దొర గారి సమాధి

సిపి బ్రౌన్  సమాధి 

ఆంధ్రగోంగూర
ఫొటో అందించిన రామ్ చెరువు గారికి ధన్యవాదములు

Wednesday, November 10, 2010

తెలుగు సాహిత్య అభిమాని సిపి బ్రౌన్‌

నేడు బ్రౌన్‌ 212వ జయంతి
సిపి బ్రౌన్‌ స్వతహాగా ఆంగ్లేయుడు అయినప్పటకీ తెలుగుభాషపై మక్కువతో తెలుగు ఉద్దరణకు పూనుకున్నారు. 1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఉద్యోగరీత్యా వారి తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తా నగరంలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌బ్రౌన్‌. 1812వ సంవత్సరంలో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో ఉంటూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817వ సంవత్సరం తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్నై నగరంలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్‌ తెలుగు

Thursday, November 4, 2010

దీపావళి శుభాకాంక్షలు

దీపాళి శుభాకాంక్షలు
 

Tuesday, October 5, 2010

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మెరిసిన తెలుగు తేజం

కామన్వెల్త్‌ క్రీడల్లో ఆటలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు వెలుగు విరజిమ్మింది. మన రాష్ట్రానికి చెందిన వి. శ్రీనివాసరావు పురుషుల వెయిట్‌ లిప్టింగ్‌ (56 కిలోలు) విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఆయన విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని కొండవెలగాడ గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో ఉంటూ ఆర్మీ ఉద్యోగిగా సేవలందిస్తున్నారు.  

Thursday, September 30, 2010

మూఢ విశ్వాసాల నీడనే గిరిజనం

ఆధునిక యుగంలోనూ గిరిజనులు మూఢ విశ్వాసాల నీడనే బతుకుతున్నారు. వారిలో చైతన్యం నింపాల్సిన అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. పాముకాటుకు మంత్రం, తేలు కుడితే నాటు వైద్యం జ్వరం వస్తే తాయత్తు వంటివి గ్రామాల్లో నేటికీ చెలామణీలో వున్నాయి.  దీని ఆధారంగా నాటు వైద్యులలు బతికేస్తున్నారు. మూఢ నమ్మకాల ముసుగులో పడి అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతినిత్యం గిరిజన ప్రాంతాల్లోనేకాక మారుమూల పల్లెల్లో కూడా చోటు చేసుకుంటూనేవున్నాయి. అధికారులు వారిలో చైతన్యం నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు, ప్రభుత్వ పథకాలు శూన్యం. ఎన్ని స్వాతంత్య్రదినోత్సవాలు జరుపుకున్నా.... వీరి బ్రతుకులు మారవు. అంతేకాకుండా  గిరిజన తండాల్లో ఆడపిల్లల విక్రయాలు, భౄణహత్యలు, చేతబడులు, నాటువైద్యం, మంత్ర తంత్రాలు నిత్యం చోటుచేసు కుంటూనే వున్నాయి. దీనికి ప్రధాన కారణం- పేదరికం, నిరక్షరాస్యత.  గిరిజనుల్లో చైతన్యం లేకపోవడం వల్ల వారు ఆడ పిల్లలను విక్రయించడం, లేదా  పురిటిలోనే పీకపిసికి చంపేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతూనే వున్నాయి.
గిరిజన తండాల్లో అభివృద్ధికి ఆమడదూరంలో జీవితాలను వెల్లబుచ్చుతున్న వీరిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరి అభివృద్ధికోసం నిస్వార్థంగా కృషిచేయాలి. అప్పుడే వీరి జీవితాలలో వెలుగులు నిండుతాయి.

Monday, September 27, 2010

ఇబుక్ కి మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?

మిత్రులారా,
ఇపుస్తకానికి (eBook), మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?
ఇబుక్ చదివినదానికి, మామూలు పుస్తకం చదివినదానికి తేడా ఏమిటి?
ఎలాంటి అనుభూతి కలుగుతుంది?
ప్రస్తుతం లేటెస్ట్ ఇబుక్స్ వివరాలను బ్లాగర్ మిత్రులు తెలపవలసిందిగా  కోరుతున్నాను.

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యవరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టును నాటి పర్యవరణం పరిరక్షణ కోసం పాటు పడాలి.  మన  పరిసరాలను మనమే కాపాడుకోవాలి.  రోజురోజుకు వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దానిలో బాగంగా గ్రేన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ లాంటివి పడకుండా, ఓజోన్‌ పొర దెబ్బతిన కుండా ఉండాలంటే ఇలాంటి కార్య క్రమాలు చేపట్టాలి. ప్రతి జీవికి ప్రాణవాయువు ఆక్సిజన్‌ ఎంతో ముఖ్యం. దాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.  ప్రతి ఇంటి ముందూ చెట్లు నాటి పర్యవరణ పరిరక్షణకు దోహదం చేయాలి.

Tuesday, September 21, 2010

యుగపురుషుడు మన గురజాడ

నేడు గురజాడ అప్పారావు 148వ జయంతి

అంధయుగం మీద ఉషస్సులా జ్వలించే శక్తిని అక్షరంలో నిక్షిప్తం చేసిన యుగపురుషుడాయన.
సామాజిక వికృతిని ప్రతిబింబించే అద్దంలా మారే విద్యను అక్షరానికి నేర్పినవాడాయన.
ఆయనే గురజాడ వేంకట అప్పారావు గారు. మధురవాణి అనే వేశ్యారత్నం ఈ క ళింగ దేశంలో పుట్టకపోతే ఎంత లోపం జరిగేదో కదా! అంటాడు ‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకశాస్ర్తి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గురజాడ అనే మహా రచయిత తెలుగునాట పుట్టకపోతే ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప శూన్యం ఆవహించేది.

Thursday, September 16, 2010

దీనికి బాధ్యులెవరు...?

రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన జరిగినా ముఖ్యంగా ఆ ప్రభావం బస్సులపై  పడుతోంది. కనిపించిన బస్సులపై వారు ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ప్రజలపైనే భారాలు మోపుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు...  రాష్ట్రంలో ఏ ఆందోళన, బంద్ జరిగినా అందరి ప్రతాపం బస్సులపైనే.  గతంలో ఆర్టీసీ అధికారులు 'నేనేం పాపం చేశాను' అంటూ బస్సు ప్రశ్నిస్తున్నట్లుగా మంటల్లో దగ్ధమైన బస్సులను ప్రదర్శనకు పెట్టినప్పటికీ

Wednesday, September 15, 2010

అద‏రగొట్టిన 'మగధీర'


జాతీయస్థాయిలో వెండితెర అవార్డుల జాబితా వెలువడింది. సినీ అవార్డుల పండుగలో కేరళ తారలు మరోమారు వెలిగాయి. వైవిధ్యం బాటలో నడుస్తూ ప్రేక్షకుల గుండెను తాకుతున్న బాలీవుడ్ అత్యధిక అవార్డులు అందుకుని విజయ పతాక ఎగురవేసింది.  మలయాళం, హిందీ చిత్రాలు పోటాపోటీగా అవార్డులు సాధించాయి.  తెలుగు సినిమాకూ రెండు అవార్డులు లభించాయి.

79 ఏళ్ల తెలుగు సినిమా

మనిషిని అత్యంత ప్రభావితం చేసిన అంశాల్లో సినిమా ఒకటి.  భాషా, ప్రాంతం... అనే ఎల్లలు లేనిది సినిమా. అసలు ఈ సినిమా  పదం 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. 'పురోగమనంలో ముందుకు పోవడం' అనేది దీని అర్థం. నాడు కదిలిన బొమ్మ, నేడు ఆధునికపు హంగులతో వేగంగా పరుగెడుతోంది. ఎన్నో వింతలు, విశేషాలు, విప్లవాలు మానవ సమాజంలో చోటుచేసుకోవడానికి కారణమైన ఈ కదిలేబొమ్మ తెలుగువారికి పరిచయమై నేటికి 79 సంవత్సరాలు.

ఈ సందర్భంగా సినిమా గురించి...1913లో తొలిభారతీయ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'ను దాదాసాహెబ్‌ ఫాల్కే తీశారు. ఇది మూకీ చిత్రం. అంటే తెరపై బొమ్మలు మాత్రమే కదులుతాయి. నటుల హావభావాలతోనే సినిమా కథను

Sunday, September 12, 2010

శ్రీకృష్ణదేవరాయలు తెలుగోడు కాదా?

కాదనే అంటున్నారు కేంద్ర మానవ వనరులశాఖా మంత్రి డి.పురంధేశ్వరి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడే కాదని, ఆయన భార్యలు, రాజ్యాభిషేకం అంశాలోనూ పలు సందేహాలు ఉన్నాయని  మంత్రి పురంధేశ్వరి వివాదస్పద
వ్యాఖ్యాలు చేశారు. రవీంద్రభారతిలో శనివారం కెఆర్‌కెఎం మెమోరియల్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో రైతురాయల స్వర్ణచరితం సంగీత నృత్య రూపకం ప్రదర్శితమైంది. రూపకాన్ని ఆధ్యంతం తిలకించిన అనంతరం సభ
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పురంధేశ్వరి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, లోక్‌సత్తాపార్టీ స్థాపక అధ్యక్షులు జయప్రకాశ్‌నారయణ పాల్గొన్నారు. 

తెలుగు సాహితీసంపద

తెలుగు సాహితీసంపదను ఒకేచోట గుదిగుచ్చి  సాహితీప్రియులకు జాలంలో విందు నేర్పాటుచేసింది

Sunday, September 5, 2010

హైదరాబాద్ హలీంకు అరుదైన గౌరవం


హైదరాబాద్ హలీంకు ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కింది. హలీం పేటెం ట్ కోసం కొన్నేళ్లుగా చేస్తున్న శ్రమకు ఫలితం లభించింది. రంజాన్ మాసంలోనే పేటెంట్ దక్కడం హలీం ప్రియులను ఆనందంలో ముంచెత్తింది. కేంద్ర ప్రభుత్వ జా గ్రఫికల్ ఇండికేషన్స్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని గ్రాండ్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో పేటెంట్ సర్టిఫికెట్ ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చే సిన పేటెంట్ కంట్రోలర్ జనరల్ పీహెచ్. కురియన్ చేతుల మీదుగా హలీం మేకర్స్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు

Saturday, September 4, 2010

యువతను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే

* నేడు ఉపాధ్యాయ దినోత్సవం
రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన యువతను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత నేటి ఉపాధ్యాయులపైనే ఉంది.  మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, సహనంతో విజయాలు సాధించడం గురుపూజోత్సవ వైభవాన్ని, విశిష్టతను  తెలియజేస్తుంది.  నేటి సమాజంలో విలువలు, క్రమశిక్షణ లోపించి గురువులపైనే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కొందరు ప్రజానాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు.  ఆవేశంతో రెచ్చగొట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో యువత భవిష్యత్తును పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.

అదే సమయంలో  ఈమధ్యకాలంలో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన సమాజానికి తలవంపులుగా మారింది.  విద్యార్థుల తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్టకరం. రోజూ పత్రికల్లో ఉపాధ్యాయుల గురించిన ఏవో సంఘటనలు కనిపిస్తూనే వుంటాయి. ఇది సభ్యసమాజానికి తలవంపులు. ఏదేమైనప్పటికీ  నేటి సమాజంలో ఉన్నత విలువలను, విశిష్టతను కాపాడాల్సిన గురుత బాధ్యత గురువులపైనే వుంది.

విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలో ఉధృతంగా, తెలంగాణాలో చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపింది. తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే

రోగాంధ్రప్రదేశ్‌ !

ఆంధ్రప్రదేశ్‌ రోగాల ముసురుతో జబ్బుపడింది. ప్రాణాలతో పరిహాసమాడే పాలకుల నిర్లక్ష్యం వల్ల అటు ఆదిలాబాద్‌ నుంచి అనంతపురం దాకా, ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ మహమ్మారి వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగ్యూ సెరిబ్రియల్‌ మలేరియా తదితర వ్యాధులతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఆగస్టు నెలలో వందమందికిపైగా, ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 20 రోజుల్లో 50 మంది మృత్యువాత పడ్డారంటే జబ్బుల తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. గత రెండునెలల్లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు

పిఆర్పీ ఆధ్వర్యంలో ‘‘న్యూస్ బులిటెన్’’

ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ‘‘న్యూస్ బులిటెన్’’ వెలువడనుంది. దీన్ని 15రోజులకొకసారి పక్షపత్రికగా తీసుకొస్తారు. దీనిలో ప్రజారాజ్యం పార్టీ వార్తలతోపాటు ఆ పార్టీపై వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యంపై వచ్చే విమర్శలకు వీరి కౌంటర్స్ గానీ, ప్రభుత్వ విధానాలపై వీరి విమర్శలకు ఇతర పత్రికల్లోనూ, చానళ్ళలోనూ చోటు దొరకడం లేదని పాపం వారు ఆవేదన చెందుతున్నారు.  పర్యవసానంగా మరో  ‘‘సొంత’’ పత్రిక ప్రజల సహనాన్ని పరీక్షించనుంది

నేను సైతం...


మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ....


నేటి భారతం - అర్థరాత్రి స్వతంత్రం


నేటి భారతం - భారతమాతా నీ బంధాలను తెంచేస్తాము


Thursday, September 2, 2010

తెలుగు జాతి మనది... నిండుగ వెలుగుజాతి మనది...


రాజువయ్యా... మహరాజువయ్యా...



పాడనా తెనుగు పాట... పరవశమై



కృషివుంటే మనుషులు రుషులవుతారు...



పుణ్యభూమి నాదేశం నమో నమామి...




తెలుగువీర లేవరా... దీక్షబూనిసాగరా...




కరుణశ్రీ ‘‘పుష్పవిలాపం’’



నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడు తున్నది. పూల బాలలు తల్లి వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు,

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

ఒక సన్నజాజి కన్నియ తన సన్నని గొంతుకతో నన్ను జూచి ఇలా అన్నది ప్రభూ.
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

ఎందుకయ్యా మా స్వేచ్ఛభిమానాని కడ్డు వస్తావ్? మేం నీకేం అపకారం చేశాం?
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో,
తాళుము, త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఇంతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా ఎర్రజేసుకుని ఇలా అన్నది ప్రభూ.
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

పాపం, మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు గాబోలునే !
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

ఓయి మానవుడా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నా హృదయకుసుమాన్ని గైకొని
నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరించుము ప్రభూ!

గురజాడ అప్పారావు ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’

మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీ కథను ?
ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?
కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజలు పువ్వులు కోసేది.
ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.
కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.
ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో;
కిలకిల పలికెను కీరములు.
ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుక్కించె
కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను;
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.
పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ;
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.
పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ;
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !
చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.
"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.
"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ
నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి;
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."
బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.
యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.
ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు వొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.
చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.
కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.

తెలుగు శంఖారావం


రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు,
సంగీతం, గానం : డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ

శ్మశానాలనూ వదలరా?

ఇక శ్మశానాలకూ ప్రైవేటు చావొచ్చిపడింది. తొలుత ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) పరిధిలో అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని శ్మశానాలనూ వ్యక్తులకూ, సంస్థలకూ ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో 10 వేల మంది కాటికాపరుల కుటుంబాలు వీధిన పడను న్నాయి. ఇన్నాళ్లూ శ్మశానాలను నమ్ముకొని బతుకుతున్న వారిని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థల పెత్తనానికి శ్మశానాలను వదిలేందుకు

శ్రీశ్రీ - మహాప్రస్థానం

శ్రీశ్రీ - మహాప్రస్థానం 
http://www.ziddu.com/download/11488741/Mahaprasthanam.pdf.html

Monday, August 30, 2010

అచ్చ తెలుగు మాట...





అచ్చ తెలుగు మాట...
పచ్చి తెలుగు మాట...
తెలుగునాట ప్రతి నోట పలకాలని;
ప్రతిన బూనరా సోదరా...
తెలుగుతల్లి రుణం తీర్చుకోరా...
నిను కన్ననేల విలువ తెలుసుకోరా...
నడవరా తెలుగుబాట...
మన జాతికదే వెలుగుబాట...
- రామ జోగయ్య శాస్త్రి

Sunday, August 29, 2010

ఢిల్లీ తెలుగు వారిని ఉర్రూతలూగించిన 'జనంపాట-జనంమాట'

తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, ప్రజా కవి సుద్దాల హనుమంతు శతజయంతి ఉత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన 'జనంపాట-జనంమాట' కార్యక్రమం స్థానిక తెలుగు ప్రజలను ఉర్రూతలూగించింది. మూడు గంటలకు పైగా ఏకబిగిన సాగిన సాంస్కృతిక సాయంత్రం ఆహూతులను కట్టిపడేసింది. ఆదివారం ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో సాహితి, ఆంధ్ర అసోసియేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు

ఆర్చి బిషప్ మారంపూడి జోజి మృతి

ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ మారంపూడి జోజి (68) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. విజయవాడ కేథలిక్‌ పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు  బిషప్ మారంపూడి జోజి.  ఈయన ఓ దళితవాడలో.. పూరి గుడిసెలో..పేద కుటుంబంలో జన్మించి కేథలిక్‌ అగ్రపీఠాన్ని అధిరోహించిన దైవసేవకుడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇటలీకి చెందిన చెందినవారు బిషప్‌లుగా కొనసాగిన విజయవాడ కేథలిక్‌ పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడిగా ఖ్యాతి పొందారు. హైదరాబాద్‌ అగ్రపీఠాన్ని అధిరోహించిన తొలి దళిత ఆర్చిబిషప్‌గా తనదైన ముద్రవేశారు.

నేడు మాతృభాషా దినోత్సవం

'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి గిడుగు రామమూర్తి జయంతి

గిడుగు రామ్మూర్తి పంతులు 147వ జయంతిని రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు.

అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను

Friday, August 27, 2010

‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను! ’... అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవిత నాకు చాలా ఇష్టం. మరి మీకో...


జయభేరి
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువనఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
* * *
ఎండకాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగిపోలేదా!
వానకాలం ముసిరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీతకాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!
* * *
నే నొక్కణ్ణీ
నిల్చిపోతే-
చండ్రగాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భుగ్నమవుతాయి!
నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు కక్కుకుంటూ
పేలిపోతాయి!
పగళ్లన్నీ పగిలిపోయీ,
నిశీథాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!
* * *
నే నొకణ్ణి ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తాలాగమిస్తాయి!
* * *
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

మన తెలుగు వెలుగులు

తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చిన ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. అన్ని రంగాల్లోను ప్రతిభామూర్తులై వెలిగి జాతికి స్ఫూర్తిగా నిలిచిన అటువంటి మహనీయుల్లో కొందరి వివరాలను లేశమాత్రంగా తెలుసుకుందాం.

Thursday, August 26, 2010

తెలుగు భాషా సాహితీవేత్తకు 'భాషా సమ్మాన్' పురస్కారం

ప్రసిద్ధ తెలుగు సాహిత్య చరిత్రకారులు, పండితులు, పరిశోధకులు కొర్లపాటి శ్రీరామమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనను దక్షిణాది నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఉత్తరాది నుంచి పంజాబీ పండితులు గురుదేవ్‌సింగ్‌ కూడా ఈ పురస్కారం లభించింది. ప్రాచీన, మధ్య యుగాల సాహిత్య రంగంలో వారు చేసిన విశేష కృషికిగానూ వారికి భాషా సమ్మాన్‌ ప్రకటిస్తున్నట్టుగా అకాడమీ తెలిపింది. వీరిద్దరుగాక, అకాడమీ గుర్తింపు లభించని ఆరు భాషల నుంచి మరో ఎనిమిది మందికి కూడా ఈ పురస్కారం లభించింది. భాషా సమ్మేళన్‌కు ఎంపికైన ఒక్కొక్కరికీ లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం ఇచ్చి సత్కరిస్తారు.

తెలుగుభాషలో కొర్లపాటి శ్రీరామమూర్తి అరుదైన, లోతైన పరిశోధనలు చేశారు. నన్నయ, తిక్కన, ఎర్రన కాలం నాటి గ్రంథాల నుంచి నిన్నమొన్నటి వరకు వచ్చిన రచనలను పరిశీలించి రెండువేల

Wednesday, August 25, 2010

వేదంలా ఘోషించే గోదావరి



చిత్రం: ఆంధ్రకేసరి
రచన : ఆరుద్ర
వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం
వేదంలా

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఎలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు
వేదంలా

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం స్త్రిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీఖంధరాశ్రేయసే

ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శృఇనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము
వేదంలా

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
వేదంలా
 

Tuesday, August 24, 2010

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక

రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికీ, మానవ సంబంధాల మమతానురాగాలకూ ప్రతీక. రాఖీ పౌర్ణమి... రక్షాబంధన్‌... పేరేదైనా పెల్లుబికే ఆనందం ఒక్కటే. మానస వీణా తంత్రులను స్పృశించే తీరు ఒక్కటే. సందెపొద్దు వెలుగులా సడిచేసే శ్రావణీ నీకిదే స్వాగతం... ప్రేమానుబంధాల పల్లకిలో అరుదెంచు సౌధామినీ నీకిదే సుస్వాగతం అంటూ అందరూ ఆహ్వానించే ఆరోజు ఈరోజే. 'నీకు నేను, నాకు నువ్వు' అన్న మధుర భావనతో రాఖీ కట్టుకుని మురిసిపోయే అన్నా చెల్లెళ్లకూ, అక్కా తమ్ముళ్లకూ మరింత ప్రత్యేకమైన రోజిది. 'అన్నా' అన్న పిలుపులో ఎంత ఆనందమో... 'అక్కా' అన్న పలకరింపులో ఎంత అనురాగమో... 'చెల్లీ' అన్న మాటలో ఎంత అనుంబంధమో... 'నేస్తం' అన్న శబ్దంలో ఎంత తీయదనమో... అనుభవించే కొద్దీ అలరించే అనుభూతుల అనుబంధాలివి. ఎన్నడూ తరగనివి, ఎప్పటికీ మాయనివి, ఏనాటికీ తనివి తీరనివి, ఆత్మీయతానురాగాల

Sunday, August 22, 2010

చెల్లెలి కోసం

అన్నాచెల్లెళ్ల మధ్య, అక్కాతమ్ముళ మధ్య అనుబంధం
విడదీయలేని రక్తసంబంధం.
ఆ బంధం ఆప్యాయతకు, అనురాగానికి ప్రతిరూపం
ఓ అన్నయ్య తన చెల్లెలి కోసం పడిన తపన..
అమ్మపై చూపిన ప్రేమ..
గుండెలను స్పృశించే కథ ‘చెల్లెలి కోసం’
.

‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురితమైన ఈ కథ
నన్నెంతగానో ఆకట్టుకుంది.
మనసును ద్రవింపజేసింది.
మీరూ చదవండి......

Saturday, August 21, 2010

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

చేతి వృత్తుల చేతులిరిగిపాయె, నా పల్లెలోన
అయ్యొ గ్రామ స్వరజ్యం గంగలోనబాయె, ఈ దేశంలోన

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈత కల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును తాగిన మంది కండ్లు నిండుసులయ్యినవి

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెల నుంచీ

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

పూసలోల్ల తాలాము కప్పలు,
కాశిలో కలసి ఖతమౌతున్నవి.

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ…
పంటపొలాల మందుల గత్తర వాసన

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై…
…బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

- గోరటి వెంకన్న

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల (వీడియో)

Tuesday, August 17, 2010

తెలుగు తేజానికి అరుదైన గౌరవం!


ఆదర్శ్ జాన్సన్ పేరిట టెక్సాస్ వర్సిటీలో స్మారక స్థూపం

అమెరికాలో హత్యకు గురైన తెలుగుతేజం ఆదర్శ్ జాన్సన్‌కు టెక్సాస్ యూనివర్సిటీ అరుదైన గౌరవం కల్పించింది. ఆయన హత్యకు గురైన నీటి కొలను ముందు ఓ స్మారక స్థూపాన్ని నిర్మించడమే గాక.. ప్రతి ఏటా ఆయనకు నివాళులర్పించాలని అధికారికంగా తీర్మానించింది. విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఓ విద్యార్థి పేరిట

Monday, August 16, 2010

విలువలకు గ్రహణం


హైదరాబాద్ : బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 15న, ఉదయం 10.30గంటలకు సుందరయ్య వికాస వేదిక ఆధ్వర్యంలో 'స్వాతంత్య్రం, సమాజం, సంస్కృతి' అంశంపై జరిగిన సదస్సులో చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేశారు. మన దేశ స్వాతంత్య్రోదమం వలసదేశాలన్నింటిలో జరిగిన ఉద్యమాల కంటే విశిష్టమైనదని ఆయన తన ప్రసంగంలో

Sunday, August 15, 2010

ఇండియన్‌ ఐడల్‌-5గా తెలుగుతేజం శ్రీరామ్

రో తెలుగుతేజం మెరిసింది. పాటల పూదోటలోవిరజాజియై గుభాళించింది. గానామృతంతో భారతావని మదిని పులకింపజేసింది. తెలుగోడి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు రాగమై, తానమై, పల్లవించాయి. ఎద ఎదనూ రంజింపజేశాయి. మదిమదినీ దోచేశాయి. పంద్రాగస్టు పర్వదినాన మన శ్రీరామ్‌ మహోన్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇండియన్‌ ఐడల్‌గా ఆవిర్భవించాడు. హైదరాబాద్‌ పాటే గెలిచింది. సోనీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షోలో తెలుగు కుర్రాడు శ్రీరామ్‌ విజయకేతనం ఎగురవేశాడు. పోటీలు జరుగుతున్న తొలి రోజు నుంచీ శ్రావ్యమైన తన గొంతుతో శ్రీరామ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు.శ్రీరామ్‌ను జడ్జీలు పొగడ్తలతో ముంచెత్తని రోజు లేదు. ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో శ్రీరామ్‌ చూపిన ప్రతిభకు సలామ్‌ కొట్టనివారు లేరు. మొన్న శ్రీరామ్‌ పాడిన 'క్వాజా మేరీ క్వాజా' అన్న పాటకు సంజయ్‌దత్‌ ఏకంగా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని తెలుగులో మాట్లాడించుకుని తనకు నచ్చిన పాటను పాడించుకుంది. హాట్‌గర్ల్‌ బిపాసాబసు,

Saturday, August 14, 2010

64వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ....

తెలుగు తేజస్వి,
త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య
స్వాతంత్ర్యదినోత్సవం అనగా చిన్నా పెద్దా తేడాలేకుండా జాతీయ పతాకాలను చేబూని నినదించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జాతీయ పతాకాన్ని  రూపొందించింది మన తెలుగువాడు మనకు గర్వకారణం.  ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. 
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు (ప్రస్తుతం మొవ్వ మండలములో ఉంది) గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది.
ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేసేందుకు కొలంబో వెళ్లాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే దక్షిణాఫ్రికాలో జరుగిన బోయర్ యుద్ధములో పాల్గొన్న దేశభక్తుడు. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన

Friday, August 13, 2010

తెలుగోడి మెరుపుల్
















ప్పుడు లక్షా ఎనభై వేలమందిలో ఒక్కడు... ఇప్పుడు కోట్లమంది మెచ్చే గాయకుడు... ప్రముఖుల ప్రశంసలు... సినిమాల్లో అవకాశాలు... సెలెబ్రెటీ హోదా... క్షణం తీరిక లేని షెడ్యూల్‌... ఆ యువకుడే ... 'ఇండియన్‌ ఐడల్‌-5' ఫైనలిస్టు... 24 ఏళ్ల తెలుగుతేజం మైనంపాటి శ్రీరామచంద్ర!

Thursday, August 12, 2010

అవరోధాలు ఎదురైనా.. ఎదురులేని తేజం

జ్రం మెరవాలంటే... కోత తప్పదు. పసిడి కాంతులీనాలంటే కొలిమిలో కాలాల్సిందే. ఇరవై తొమ్మిదేళ్ల తేజస్వినీ సావంత్‌ ఈ రోజు.. షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిందన్నా... పన్నెండేళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డుని సమం చేసిందన్నా... ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క భారత మహిళగా కీర్తినందుకొందన్నా... దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. అవరోధాలను దాటిన.. ఆర్థిక పరీక్షలకు ఎదురునిలిచిన నేపథ్యం ఉంది.

Sunday, August 1, 2010

అంతర్జాలంలో సమాచార అన్వేషణ..!


ప్రపంచంలో అతిపెద్ద సమాచార భాండాగారం ఏదైనా వుందంటే అది ఒక్క ఇంటర్నెట్‌ (అంతర్జాలం) మాత్రమే. ఇంతటి భాండాగారం నుంచి వెతికి పట్టుకునే ఓపిక మనకుండాలిగానీ ఏ సమాచారం కావలసినా ఇక్కడ లభ్యమవుతుంది. అయితే వచ్చిన చిక్కల్లా మనకు కావాల్సిన సమాచారాన్ని తక్కువ వ్యవధిలో వెతికిపట్టుకోవడమెలా అన్నదే. అవసరమైన సమాచారం అవసరమైన సమయంలో లభ్యంకాక నెట్‌పై గంటలకొద్దీ గడిపేవారు అనేకమంది వున్నారు. ఏవో నాలుగు పదాలు టైప్‌చేసి, వచ్చిన సమాచారంతో సంతృప్తి పడిపోయే వారైతే ఫర్వాలేదు గానీ ప్రత్యేకించి ఫలానా సమాచారం కావాలి అని అన్వేషించేటప్పుడు చాలా సందర్భాల్లో కావాల్సిన సమాచారం లభించకపోవడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. ఎంత ప్రయత్నించినా సమాచారం దొరకకపోయేసరికి విసుగుచెంది, 'ఇంటర్నెట్‌లో అన్నీ దొరుకుతాయనుకోవడం భ్రమ' అంటూ ఓ నిట్టూర్పు విడవడమూ పరిపాటే.
సమాచార సేకరణలో అంతర్జాలాన్వేషణ ఒక అద్భుతమైన కళ. వాస్తవానికి మన వెదుకులాటంతా ఒకటి రెండు సెర్చ్‌ఇంజన్ల చుట్టూనే తిరుగుతుంటుంది. ఏరకమైన సమాచారం కావాలన్నా వీటి చుట్టూనే తిరుగుతుంటాము తప్ప ఒక్కో సమాచారం ఒక్కో సెర్చ్‌ ఇంజన్‌లో వెదకడం సులువుగా వుంటుందనే విషయం ఎంతకీ మనకు అవగతంకాదు. వెదకడం చేతనైతే సమాచారం క్షణాల్లో లభిస్తుంది. అందుకు అవసరమైన కీవర్డ్స్‌, బులియన్‌ అపరేటర్‌ పదాలు, సింబల్స్‌నీ పద్ధతిగా ఉపయోగిస్తే తొంభైతొమ్మిది శాతం ఆశాభంగమనేది వుండదు.
ఇంతటి సమాచార భాండాగారాన్ని శోధించడం ఏ ఒకటో రెండో సెర్చ్‌ఇంజన్ల వల్ల అయ్యేపని కాదు. దీనికి వేలాది సెర్చ్‌ ఇంజన్‌ సైట్లు అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి. వీటిని- సెర్చ్‌ ఇంజన్లు, వెబ్‌ డైరెక్టరీలు, మెటా సెర్చ్‌ ఇంజన్లు అనే మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు.
సెర్చ్‌ ఇంజన్‌ : మనం ఇచ్చిన కీవర్డ్స్‌ ఆధారంగా ఇంటర్నెట్‌లోని వెబ్‌పేజీలను అన్వేషించి, సంబంధిత పేజీల లింక్‌లతో ఫలితాలను అందిస్తుంది. ఈ పనిని CGI (Common Gateway Interface) వంటి సర్వర్‌సైడ్‌ స్క్రిప్ట్‌లు చేస్తాయి.
వెబ్‌ డైరెక్టరీ : ఉన్నతస్థాయి వెబ్‌సైట్లు కొన్ని అంతర్జాలంలోని వివిధ వెబ్‌సైట్లనన్నిటినీ సమీక్షించి, వాటిలోని సమాచారం ఆధారంగా వాటిని డైరెక్టరీలుగా, సబ్‌డైరెక్టరీలుగా విభజించి, సిద్ధంగా వుంచుతాయి. వీటినే 'వెబ్‌ డైరెక్టరీ'లు అంటారు. ప్రత్యేక సమాచారం కావాలనుకొన్నప్పుడు తప్ప ఏదైనా సాధారణ సమాచారం కోసమైతే నేరుగా ఈ వెబ్‌ డైరెక్టరీలలోకి వెళ్ళి, ఆయా సమాచారాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌ డైరెక్టరీ సైట్‌లు సెర్చ్‌ ఇంజన్‌ సదుపాయాన్ని కూడా కలిగి వుంటాయి. సమాచారాన్ని ఆ ప్రత్యేకమైన వెబ్‌ డైరెక్టరీల నుంచో, లేదా మొత్తం ఇంటర్నెట్‌ అంతటినుంచో సెర్చ్‌ ఇంజన్‌ ద్వారా వెదకవచ్చు. ఉదాహరణకి ప్రపంచ ప్రసిద్ధ సెర్చ్‌ ఇంజన్‌ కమ్‌ వెబ్‌డైరెక్టరీ యాహూ! లో ఏదైనా విషయాన్ని వెదికితే... ఇంటర్నెట్‌ నుంచే కాక, వెబ్‌ డైరెక్టరీల నుంచి కూడా పేజీలను ఎంపిక చేసి చూపుతుంది.
మెటా సెర్చ్‌ ఇంజన్లు : మెటాక్రాలర్‌, వెబ్‌క్రాలర్‌లను మెటా సెర్చ్‌ ఇంజన్లు అంటారు. ఇవి చాలా శక్తివంతమైనవి. ఇవి అనేక సెర్చ్‌ ఇంజన్ల సమూహాలు. ఏదైనా ఒక విషయాన్ని వీటిలో సెర్చ్‌ చేసినప్పుడు ఏకకాలంలో అనేక సెర్చ్‌ ఇంజన్ల ద్వారా ఆ సమాచారాన్ని వెదికి, వచ్చిన ఫలితాలను సమీక్షించి, మనం అడిగిన సమాచారానికి ఎక్కువ సంబంధం కలిగి వున్నవాటిని ముందుగాను, తక్కువ సంబంధం వున్నవాటిని ఆ తర్వాత వరుసలోనూ కనిపించేటట్లు చూపుతుంది. ఇందువల్ల మనకెంతో సమయం ఆదా అవుతుంది. ఏదైనా ఒక సమాచారం కోసం గూగుల్‌లో ప్రయత్నించడం... అక్కడ లభ్యంకాక మరొకటి మరొకటి అంటూ... అలసిపోయేకంటే ఒకేసారి అన్నిటినీ సెర్చ్‌ చేసే మెటాసెర్చ్‌ ఇంజన్‌ ద్వారా ప్రయత్నించడం మంచిది. అటువంటప్పుడు ఇక మామూలు సెర్చ్‌ ఇంజన్లు ఎందుకు ? అందరూ మెటాసెర్చ్‌ ఇంజన్లనే వాడవచ్చు కదా! అనే అనుమానం రావడం సహజం. అయితే మామూలు సెర్చ్‌ ఇంజన్లు, డైరెక్టరీలు లేకపోతే మెటాసెర్చ్‌ అనేదే లేదు. అంతేకాకుండా ఒక్కో సెర్చ్‌ఇంజన్‌కి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. ఆ ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని ఆయా సెర్చ్‌ ఇంజన్‌ల ద్వారా సెర్చ్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం వుంటుంది.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొన్ని సెర్చ్‌ ఇంజన్ల స్వరూప స్వభావాలను చూద్దాం:
అల్టావిస్టా (www.altavista.com):  సెర్చ్‌ ఇంజన్‌ అనగానే ఇటీవల చాలామంది గూగుల్‌ అంటున్నారు. కానీ నిజానికి ఎప్పటినుంచో సమర్థవంతమైన సెర్చ్‌ ఇంజన్‌గా దీనికి పేరుంది, అంతర్జాలంలో ఫొటోలను, ఆడియో, వీడియోలను మొదటి పరిచయం చేసిన సెర్చ్‌ఇంజన్‌ కూడా ఇదే. ప్రపంచ ప్రసిద్ధమైనది అల్టావిస్టా. ఏ రకమైన సమాచారాన్నయినా క్షణాల్లో అందించగల అపురూపమైన ఇంజన్‌ ఇది. ముఖ్యంగా ఇమేజ్‌లను సెర్చ్‌ చేయడంలో దీనికి సాటిలేదని పేరు.
ఆస్క్‌జీవాస్‌ (www.ask.com)  : మామూలుగా మనం ఒక ప్రశ్న అడిగితే అందులో ముఖ్యమైన పదాలను మాత్రమే సెర్చ్‌ ఇంజన్లు గుర్తిస్తాయి. is, was, how, why, do  వంటి పదాలను విస్మరిస్తాయి. అందువల్ల ఇటువంటి పదాలను వదలి, నేరుగా ముఖ్యమైన రెండు మూడు కీవర్డ్స్‌ని మాత్రమే టైప్‌ చేస్తాం. కానీ ఆస్క్‌జీవాస్‌లో కీవర్డ్స్‌ కాకుండా నేరుగా ప్రశ్ననే టైప్‌ చేసే వీలుంది. అంతేకాకు దీనికి వున్న మరో ప్రత్యేకత... మన ప్రశ్నకి సంబంధించిన లింక్‌ వున్న ఇతర విషయాలను కూడా అక్కడే అందిస్తుంది.
గూగుల్‌ (www.google.com):  ప్రస్తుతం ఎవరికీ పరిచయం అవసరంలేని సెర్చి ఇంజన్‌ గూగుల్‌. ఇటీవల కాలంలో బాగా ప్రసిద్ధి పొందిన సెర్చ్‌ ఇంజన్‌ కూడా ఇదే. ఉన్నత స్థాయికి చెందిన ఆధునికమైన టెక్స్‌ట్‌- మ్యాచింగ్‌ టెక్నిక్స్‌ సహాయంతో మనకి కావలసిన, సంబంధిత సమాచారాన్ని క్షణాల్లో వెదకడం దీని ప్రత్యేకత. ఇపుడు ఈ సెర్చ్‌ ఇంజన్‌ దాదాపుగా భారతీయ భాషలన్నిటిలోనూ ఇంటర్‌ఫేస్‌లను రూపొందించుకుని ఆదరణ పొందుతోంది.
హాట్‌బాట్‌ (www.hotbot.com):  ప్రపంచ ప్రసిద్ధ 'వైర్‌డ్‌ మ్యాగజైన్‌'కి చెందిన ఈ ఇంజన్‌ ఇంక్‌టామి (Inktomi) సెర్చ్‌ పవర్‌తో పనిచేస్తుంది. సమాచారాన్ని ప్రాంతాలవారీగా సెర్చ్‌ చేసేందుకు ఇది ఉపకరిస్తుంది.
లైకోస్‌ (www.lycos.com):  హాట్‌బాట్‌తో అనుబంధం కలిగిన లైకోస్‌ పలు వెబ్‌ సర్వీస్‌లను అందిస్తుంది. వాటిలో సెర్చ్‌ కూడా ఒకటి. కొత్తవారికి అన్ని విధాలా సహకరిస్తూ సులభంగా సమాచారాన్ని అందించే ఈ వెబ్‌సైట్‌ ఉచిత వెబ్‌స్పేస్‌ను కూడా అందిస్తుంది.
వెబ్‌క్రాలర్‌ (www.webcrawler.com):  మెటా సెర్చ్‌ ఇంజన్‌ అయిన వెబ్‌క్రాలర్‌ అతి సాధారణమైన ఇంగ్లీష్‌ పదాల ద్వారా మంచి ఫలితాలను అందించడంలో దిట్ట. నెట్‌ సెర్చ్‌ చేయడంలో కొత్తవారికి సహకరించేలా రూపొందించినదే అయినా అనేక అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కూడా కలిగి వుంది.
యాహూ! (www.yahoo.com):  అత్యంత విస్తృతమైన వెబ్‌ ఇండెక్స్‌ని కలిగిన డైరెక్టరీ - కమ్‌ - సెర్చ్‌ ఇంజన్‌ ఇది. ఈ సర్చ్‌ఇంజన్‌ని మన స్వంత సైట్లో కూడా ఉచితంగా ఉంచవచ్చు. యాహూ సెర్చ్‌ఇంజన్‌ కూడా గూగుల్‌ పవర్‌తో నడుస్తోందిపుడు.
ఇంటర్‌నెట్‌లో డాక్కుమెంట్‌లకే కాక ఇతర విషయాలనూ సెర్చ్‌ చేయవలసి వస్తూంటుంది. నెట్‌లో ప్రత్యేక విషయాల మీద ఆసక్తి కలిగిన అనేక మంది ప్రత్యేకమైన న్యూస్‌ గ్రూపులుగా ఏర్పడి. పరస్పరం ఇ-మెయిల్స్‌ పంపుకుంటూ ఉంటారు. వీటిని 'మెయిలింగ్‌ లిస్ట్‌' లు అంటారు. ఆ న్యూస్‌ గ్రూప్స్‌ మెయిలింగ్‌ లిస్ట్‌లలో ఎంతో గొప్ప సమాచారం లభిస్తూంటుంది. మామూలు వెబ్‌ సర్చ్‌లో ఈ సమాచారం లభించకపోవచ్చు. అటువంటపుడు ప్రత్యేకంగా న్యూస్‌ గ్రాపుల్ని వెదకడం మంచిది. దీనికోసం యాహూ గ్రూప్స్‌(groups.yahoo.com),  గూగుల్‌ గ్రూప్స్‌ (groups.google.com)  డేజా (www.deja.com),  సన్‌సైట్‌ గ్రూప్‌ సెర్చ్‌ (sunsite.unc.edu/usenet-i/search.html)  వంటి సైట్లను ఉపయోగించుకోవచ్చు.
అదే విధంగా వ్యక్తుల అడ్రస్‌లు, ఇ-మెయిల్స్‌ వివరాల కోసం 'పీపుల్‌ సెర్చ్‌' చేయవలసి ఉంటుంది. ఈ విధమైన సమాచారం అందించడంలో బిగ్‌ఫుట్‌ (www.bigfoot.com)  సైట్‌ చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఇ-మెయిల్‌, ఇంటి అడ్రస్‌లతో బాటు వీధి మేప్‌లను కూడా అందించే ఈ పీపుల్‌ సెర్చ్‌ సౌకర్యాలు చాలా వరకూ అమెరికాకే పరిమితమవుతున్నాయి. వ్యక్తిగత వివరాలను అందించే ఈ పీపుల్స్‌ సెర్చ్‌ సైట్లు టెలిఫోన్‌ నంబర్స్‌ని, వ్యక్తిగత వెబ్‌సైట్‌ అడ్రస్‌లనూ కూడా అందించగలవు. కానీ దీనికి కొంత సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. ఇటువంటి సైట్లలో మరోక ప్రసిద్ధ సైట్‌ (www.whowhere.com),  పీపుల్‌ సెర్చ్‌ (www.yahoo.com/search/ people/email.html) లో కూడా వ్యక్తుల ఇ-మెయిల్‌ అడ్రస్‌లను వెదకవచ్చు.
సాఫ్ట్‌వేర్స్‌ని సెర్చ్‌ చేయడంలో అత్యంత విశ్వసనీయమైన సెర్చ్‌ ఇంజన్‌లు అన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

టుకౌస్‌: (www.tucows.com)  ఏంటివైరస్‌, గేమింగ్‌, మల్టీమీడియా, కనెక్టివిటీ - ఇలా వివిధ విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్స్‌ సమాహారం ఈ సైట్‌. రెండు ఆవుల (Two-Cows)  సింబల్‌ కలిగిన ఈ సైట్‌ సాఫ్ట్‌వేర్‌ సెర్చ్‌లో ముఖ్యమైనది.

డౌన్‌లోడ్‌: (www.download.com) : CNETకి చెందిన ఈ సెర్చ్‌సైట్‌ వెబ్‌ ప్రపంచంలోని అతి ముఖ్యమైన షేర్‌వేర్స్‌ని, ఫ్రివేర్స్‌ని ఒక క్రమపద్ధతిలో అందిస్తుంది.

షేర్‌వేర్‌: (www.shareware.com) ది కూడా షేర్‌వేర్స్‌ వర్గీకరించి, డౌన్‌లోడ్‌కి వీలుగా అందించే ప్రసిద్ధ సైట్‌. ఇంకా sharewarejunkies, totalshareware, zdnet, hotflies  మొదలైనవన్నీ ఈ కోవకి చెందినవే.

జాంబో: (www.jumbo.com): రెండున్నర లక్షలకు పైగా షేర్‌వేర్స్‌నిFTP విధానంలో డౌన్‌లోడ్‌కి అందించే ప్రసిద్ధ సైట్‌ ఇది. విండోస్‌ మాత్రమే కాక, మేక్‌, యునిక్స్‌ వంటి ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లపై పనిచేసే సాఫ్ట్‌వేర్స్‌ని కూడా ఈ సైట్‌ అందిస్తుంది.
చిన్న సెర్చ్‌ఇంజన్‌ ద్వారాను, పెద్ద వెడ్‌ డైరెక్లరీ నుంచీ లభించే సమాచారం కూడా సరిపోని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి Ph.D.  చేసేటపుడు వారికి కావలసిన సమాచారం అనేక సెర్చ్‌ఇంజన్లతో ఒకేసారి వెదికే మెటాసెర్చ్‌ చేయక తప్పదు. అయిగే ఒకోసారి ఇది కూడా పూర్తి ఫలితాలను అందిచలేకపోవచ్చు. అటువంటి సందర్భాలలో ప్రత్యేకమైన 'సెర్చింగ్‌ సాఫ్ట్‌వేర్‌'ని ఆశ్రయించక తప్పదు.
సెర్చింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందినది కోపర్నిక్‌ (Copernic).  మామూలు సెర్చ్‌ఇంజన్‌ల మాదిరి కాకుండా ఇది ప్రత్యేకమైన టెక్నిక్స్‌తో పని చేస్తుంది. ఇది వెబ్‌ సమాచారాన్ని రకరకాలుగా అన్వేషించి, వేగంగా పని పూర్తయ్యేటట్లు చేస్తుంది. అంతే కాక మనం చేసిన సెర్చ్‌ని దశలవారీగా దాచి ఉంచడం, ఫలితాలను విశ్లేషించడం వంటి అదనపు సైకర్యాలను కూడా కలిగి ఉంది.
ఈ కోపర్నిక్‌ సాఫ్‌వేర్‌ - ఏజంట్‌, ఎంటర్‌ప్రైజ్‌, సమ్మరైజర్‌ అనే మూడు వర్షన్స్‌గా లభిస్తోంది. 'ఏజంట్‌' వ్యక్తిగతంగా వెబ్‌ సమాచారాన్ని అన్వేషించడానికి, ఎంటర్‌ప్రైజ్‌ ఎడిషన్‌ సంస్థలకూ ఉపయోగపడతాయి. సమ్మరైజర్‌ ఏ డాక్యుమెంట్‌/వెబ్‌ పేజిని అయినా వెంటనే విశ్లేషించి సంక్షిప్తంగా విషయాన్ని అందిస్తుంది.
అయితే సెర్చ్‌ విషయానికి వస్తే బాగా ఉపయోగపడేది కోపర్నిక్‌ ఏజంట్‌, ప్రస్తుతం దీని వర్షన్‌ 6.0 లభిస్తోంది. దీనిలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి - జేసిక్‌, పర్సనల్‌, ప్రొఫెషనల్‌. వీటిలో బేసిక్‌ వర్షన్‌ని కోపర్నిక్‌ సూట్‌ (www.copernic.com/en/products/agent/download.html)  నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
కోపర్నిక్‌ వంటి సాఫ్టవేర్లు తమ పద్ధతిలో తాము సెర్చ్‌ చేస్తాయి. అయితే ఫ్రీగా లభించే వర్షన్స్‌ పరిమితంగా పని చేస్తాయి. కాబట్టి సమాచారం కోసం సామాన్యులు సెర్చ్‌ఇంజన్‌ సైట్లపై ఆధారపడక తప్పక. సెర్చ్‌ఇంజన్‌ ద్వారా అన్వేషణ చేసేటపుడు కొద్దిపాటి మెలువల పాటస్తే ఎటువంటి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్స్‌ అవసరమూ ఉండదు.
ప్రాథమికంగా అన్ని సెర్చ్‌ఇంజన్లు చేసే పనీ ఒకటే అయినా అవి పనిచేసే తీరులో తేడాలు ఉంటాయి. ఆ తేడాలను గుర్తించి, ఏ సెర్చ్‌ఇంజన్‌ని ఎలా ప్రశ్నిస్తే సరైన ఫలితాలతో కావలసిన సమాచారం లభిస్తుందె గ్రహించాలి. ప్రపంచ ప్రసిద్ధ సెర్చ్‌ఇంజన్లు చాలా వాటిలో ఉపయోగించవలసిన కొన్ని మెళకువలను, చిన్న చిన్న సూచనలనూ ఇక్కడ ఇస్తున్నాం. అయితే ఇందులో ప్రతీదీ ప్రతి సెర్చ్‌ఇంటన్‌కి సరిపోకపోవచ్చు. కానీ ఉపయోగించే సెర్చ్‌ఇంజన్‌ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండి, సరిగ్గా ఉపయోగపడతాయి, కావలసిన సమాచారాన్ని క్షణాల్లో కళ్లముందు ఉంచుతాయి.

సెర్చింగ్‌ మెళకువలు :
* కీవర్డ్స్‌ ఉపయోగించేటపుడు వీలైనంత ఖచ్చితమైన పదాల్ని ఉపయోగించండి. మారుతి 800 కారు గురించి సమాచారం కావాలంటే CARS అనో, ABOUT CARS  అనో టప్‌ చేయకండి. అలా చేస్తే అనవసరమైన ఫలితాలు వచ్చి, వాటి నుంచి అసలు సమాచారాన్ని పొందడం కష్టమవుతుంది.
* పదాల మధ్య ఒక స్పేస్‌ మాత్రమే ఉండేలా జాగ్రత్త వహించండి.
* కొన్ని సెర్చ్‌ ఇజన్లు కేస్‌ సెన్సిటివ్‌ ఆప్షన్‌ని కూడా అందిస్తున్నాయి. అంటే క్యాపిటల్‌, స్మాల్‌ లెటర్స్‌ భేదాన్ని సెర్చ్‌ఇంజన్‌ గురించాలా వద్దాఆ అనేది మనమే నిర్ణయించుకోవచ్చు.
* కొన్ని ఇంజన్లు పంక్చుయేషన్‌ని, కోట్స్‌నీ ఒకేలా గుర్తిస్తాయి. దానిని గమనించండి.
* స్పానిస్‌ : ఫ్రెంచ్‌ వంటి ఇతర భాసల రిజల్ట్స్‌ కూడా కలగలిసిపోయి, అవసరమైన సమాచారం మరుగునపడిపోకుండా లాంగ్యేజ్‌ సెట్టింగ్స్‌లో ప్రత్యేకంగా ఇంగ్లీష్‌ని సెలెక్ట్‌ చేసుకోవడం మంచిది.
* కొన్ని పదాలు ప్రక్కపక్కనే టైప్‌ చేసినపుడు కొన్ని సెర్చ్‌ఇంజన్లు ఆ పదాలన్నిటినీ కలిగి ఉన్న వెబ్‌ పేజీలను అందిస్తే, మరికొన్ని సెర్చ్‌ ఇంజన్లు ఆ పదాలలో ఎ ఒక్కటి ఉన్నా ఆ వెబ్‌పేజీలను అందిస్తాయి. అంటే cat, dog  అని సెర్చ్‌ చేస్తే కొన్ని cat OR dog  గా అర్థం చేసుకుంటాయి. ఎక్కువ సైట్లు గానే అర్థం చేసుకుంటాయి.
* బులియన్‌ ఆపరేటర్లను ఉపయోగించడం వల్ల ఎంతో సమర్థవంతమైన సెర్చ్‌ చేయవచ్చు. AND, OR, NOT,  డబుల్‌ కొటేషన్స్‌ '' '', పేరెంథసిస్‌ (), NEAR, AND, NOT  - ఇవన్నీ ఆపరేటర్లే. కీవర్ట్స్‌తో వీటిని వాడినపుడు సెర్చ్‌ఇంజన్‌ Tableలో సూచించిన విధంగా అర్థం చేసుకుంటుంది.
అల్టావిస్టా, గూగుల్‌ వంటి సైట్లు సెర్చ్‌ ఇంజన్‌లోనే కొన్ని విభాగాలను ఏర్పరచాయి. ఏ రకం ఫైల్‌ కావాలంటే ఆ విభాగాన్ని వెదికితే పని సులభమవుతుంది.
అదేవిధంగా కొన్ని సెర్చ్‌ఇంజన్లు సకల సౌకర్యాలూ కలిగిన తమ టూల్బబార్స్‌ని అందిస్తున్నాయి. యాహూ, గూగుల్‌, అల్టావిస్టా మొదలైనవన్నీ ఈ కోవకు చెందినవే. ప్రతిసారీ సెర్చ్‌ఇంజన్‌ సైట్‌లోకి వెళ్లవలసిన పనిలేకుండా ఇవి పనికివస్తాయి. కాకపోతే బ్రౌజర్‌లో కొంత స్థలాన్ని ఆక్రమిస్తాయి. కొన్ని ప్రకటనలతో విసిగిస్తాయి.

- cat AND dog  అని టైప్‌ చేస్తే- cat మరియు dog అనే రెండు పదాలు వున్న వెబ్‌పేజీలను చూపించు అని అర్థం.
- cat OR dog అని టైప్‌ చేస్తే- cat, dog   అనే పదాల్లో ఏ ఒక్కటివున్నా, రెండూవున్నా ఆ పేజీలను చూపించు అని అర్థం.
- "cat or dog"  అని టైప్‌ చేస్తే- cat and dog   అనే పదప్రయోగం, పద సమూహం సరిగ్గా అదే వరుసలో చూపించు అని అర్థం.
- (tiffin OR meals) AND (tea AND coffee) అని టైప్‌ చేస్తే- టిఫిన్‌గాని, మీల్స్‌గాని వుండి, టి, కాఫీ రెండూ వున్న పేజీలను చూపించు అని అర్థం.
- cat NEAR dog  అని టైప్‌ చేస్తే- cat అనే పదం, dog అనే పదం కాస్త దగ్గర దగ్గరలో అంటే - 10నుంచి 15 పదాలలోపు వుండే పేజీలను చూపు అని అర్థం.
- cat AND NOT dog  అని టైప్‌ చేస్తే- cat అనే పదం వున్న పేజీలను వెదికి, వాటిలో వేటిలోనైనా dog అనే పదం వుంటే వాటిని తీసేసి, మిగిలిన పేజీలను అందించు అని అర్థం. ఇక్కడ AND NOT  అనే పదాలను కలిపి వుపయోగించాలి. ఇలాకాక NOT ఒక్కటే ఉపయోగిస్తే కొన్ని సెర్చ్‌ఇంజన్లు ఈ అర్థాన్ని గురించవు.
- కొన్ని ఆల్టావిస్టా వంటి కొన్ని సెర్చిఇంజన్లు * ను కూడా గుర్తిస్తాయి. ఉదాహరణకు cal*r  అని సెర్చ్‌ చేస్తే- color, colour - రెండిటినీ సెర్చ్‌ చేస్తుంది. ముఖ్యంగా ఏదైనా పదానికి సంబంధించిన స్పెల్లింగ్‌ సరిగా తెలియనప్పుడు ఆ పదంలో సందేహం వున్నచోట * ను టైప్‌ చేయడం ద్వారా ఫలితం పొందవచ్చు.

- RajuKX


Saturday, July 24, 2010

అంతర్జాలంలో రచ్చబండలు

సాంకేతిక విజ్ఞానంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కొత్తకొత్త ఆవిష్కరణలు సామాన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరహాలో ప్రజలకు చేరువైన సాంకేతిక విప్లవం అంతర్జాలం (ఇంటర్నెట్‌). ఇది ఆవిష్కృతమైన తొలినాళ్ళలో ఒక వెబ్‌సైట్‌ అంటేనో, ఇ-మెయిల్‌ చేయడమంటేనో చాలా ఘనంగా వుండేది. వెబ్‌ 2.0 ఆవిర్భవించాక సామాన్యులకు సైతం చేరువైన సాంకేతిక విప్లవం సోషల్‌ నెట్వర్కింగ్‌. దీన్నే 'సామాజిక కూడలి' అని కూడా వ్యవహరిస్తున్నారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే అంతర్జాలంలో రచ్చబండలు. రచ్చబండలనగానే మనకు గుర్తొచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండలపై జరిగే చర్చలు. గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక రకాల అంశాలు చర్చించడం సర్వవిదితమే. ప్రస్తుతం ఈ చర్చలు సోషల్‌ నెట్వర్క్‌ల వేదికగా అంతర్జాలాన్ని ఏలుతున్నాయి. అంతర్జాలాన్ని వాడే ప్రతి నలుగురిలో ముగ్గురు ఏదోక సోషల్‌ నెట్వర్క్‌లో సభ్యులవుతున్నారని, ఈ ఆన్‌లైన్‌ సంబంధాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా చదువులోనూ, కెరీర్‌లో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కంప్యూటర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సోషల్‌నెట్వర్క్‌లలో ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మింగిల్‌బాక్స్‌, ఐబిబూ, మైస్పేస్‌, ఫ్లికర్‌ వంటివి ఎన్నో వున్నాయి. ఇంకా అనేక కొత్తకొత్త నెట్వర్క్‌లు పుట్టుకొస్తున్నాయి. గూగుల్‌ సెర్చింజన్‌ ఆర్కుట్‌ను నిర్వహిస్తుండగా, ఇప్పుడు యాహూ కూడా సోషల్‌ నెట్వర్కింగ్‌ క్షేత్రంలోకి అడుగుపెట్టనుంది. యాహూకు చెందిన అని సైట్లలో ఇప్పుడు ఫేస్‌బుక్‌, మైస్పేస్‌ లాంటి సోషల్‌ నెట్వర్కింగ్‌లకు చెందిన ఫీచర్స్‌ లభ్యమవుతున్నాయి. అంతర్జాలంలో స్నేహితుల కోసం యువతరం ఎక్కువగా వీటినే ఆశ్రయిస్తోంది. ఈ నెట్వర్కులు కూడా తమ తమ సభ్యులను ఆకర్షించడంలోనూ, సరళమైన భాషలోనూ, ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను అందించడంతోపాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇటువంటి ఉన్నతమైన ఫీచర్లను అందించడంలో ఆర్కుట్‌ ముందంజలో వుందని అంతర్జాల నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వీటి నిర్వహణకు ఎటువంటి ఖర్చూ లేకపోవడంతోపాటు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం వుంది. ఒకే రకమైన అభిరుచి, ఆలోచనలు, అభిప్రాయాలుున్నవారు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకునేందుకు ఇదో చక్కని వేదిక. ఈమధ్య కేంద్ర విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్‌ ''ఎకానమీ క్లాసులో ప్రయాణమంటే పశువుల మందలో కలిసి వెళ్ళడమే' అంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. ట్విట్టర్‌ గురించి ఆయన మాట్లాడుతూ- 'రోజులో వందమందిని కలవలేకపోవచ్చు.కానీ నేను పంపే ఒక ఎస్సెమ్మెస్‌ మూడు లక్షలమందిని చేరుతుంది' అని అంటారాయన. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సైతం ట్విట్టర్‌ వినియోగోదారుడేననే విషయం తెలిసిందే. దీన్నిబట్టి ఈ నెట్వర్కుల ప్రాచుర్యం ఎంతగా వుందో తెలుస్తుంది. 
మనదేశంలో ఆర్కుట్‌కు 160లక్షల మంది, ఫేస్‌బుక్‌కు 80లక్షల మంది, ట్విట్టర్‌కు 14లక్షల మంది వినియోగదారులున్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు.
సోషల్‌ నెట్వర్కింగ్‌ అంటే...
ఒక్కమాటలో చెప్పాలంటే ఒకే రకమైన అభిరుచి, అభిప్రాయం, భావనలు కలిగినవారు లేదా ఒకే రంగానికి చెదినవారిని ఏకంచేసి, ఒకరి ఆలోచనలను, అభిప్రాయాలను ఇంటర్నెట్‌లో పంచుకోగలిగిన ఒక సౌలభ్యంగా దీన్ని చెప్పవచ్చు. జనాలను ఒకరితో ఒకరు అనుసంథానం చెయ్యడమే వీటి పని. ఇలాంటి స్థితిని చక్కగా ఉపయోగించుకోవడానికి పుంఖాను పుంఖాలుగా సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లు పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్ని ప్రముఖ సైట్లు, అవి అందిస్తున్న సదుపాయాలను తెలుసుకుందాం :
ఆర్కుట్‌ :
సుప్రసిద్ధ గూగుల్‌ సెర్చింజన్‌కు చెందిన ఆర్కుట్‌ గురించి తెలియనివారు వుండంటే అతిశయోక్తి కాదేమో. వయస్సుతో తారతమ్యం లేకుండా అందరికీ ఇందులో అకౌంటు వుంటోంది. జిమెయిల్‌ ఎకౌంట్‌ ప్రతి ఒక్కరూ ఆటోమ్యాటిక్‌గా అదే ఎకౌంట్‌తో దీనిలో లాగిన్‌ కావచ్చు. ఇందులో ఎంతోమంది ప్రతినిత్యం స్క్రాప్స్‌ చేస్తూనే వుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు తమతో చదువుకున్న స్నేహితులను కూడా దీని ద్వారా కలుసుకుంటూనే వున్నారు. నలుగురు స్నేహితులు ఒకేసారి కలిసి మాట్లాడుకునే సదుపాయం ఆర్కుట్‌లో వుంది. ఒక గ్రూపులా ఏదైనా చర్చించాలన్నా, సరదాగా రచ్చబండ దగ్గర పిచ్చాపాటీ మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవాలన్నా చాలా సులువుగా చేయవచ్చు. చాట్‌ చేయడానికి మొదట ఒక స్నేహితుని ఎంపిక చేసుకున్న తర్వాత, ఆ చాట్‌ విండోలో కింది భాగాన వున్న గ్రూప్‌చాట్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే మరింతమంది స్నేహితులను ఆ చాట్‌లోకి ఆహ్వానించవచ్చు. అయితే గ్రూప్‌ చాటింగ్‌కి ఇతర సదుపాయాలు కొన్నివున్నప్పటికీ ఎక్కువమంది వినియోగదారులున్న ఆర్కుట్‌లో ఈ సౌలభ్యం వుండడం మరింత ఉపయోగకరం. మన దేశానికి వస్తే ఆర్కుట్‌కే ఎక్కువ మంది వినియోగదారులున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ దీనికి వినియోగదారులున్నారు.
ఫేస్‌బుక్‌ :
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరు నెటిజన్లు వాడే సోషల్‌ నెట్వర్కింగ్‌ సర్వీసుల్లో ఫేస్‌బుక్‌దే సింహభాగం. ప్రపంచవ్యాప్తంగా 350మిలియన్ల యూజర్లు దీనిలో సభ్యులుగా వున్నారంటే దీని విస్తృతిని అంచనా వేయవచ్చు. అంతే కాకుండా 3.5మిలియన్ల ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌చేసి తమ తమ మిత్రులతో పంచు కుంటున్నారు. ఈమధ్య మరింత ఊపందుకున్న ఈ నెట్వర్కింగ్‌ మొదటి నుంచీ తనదయిన ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇప్పటివరకూ యాహూ లాంటి కొన్ని సంస్థలు దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా ఇది సంసిద్దతను వ్యక్తం చేయలేదు. మొదట యూనివర్శిటీలలో జనాల మధ్య నెట్వర్కులను సృష్టించుకోవడానికి ఉపయోగపడింది. మొదట్లో ఇందులోకి ప్రవేశించాలంటే యూనివర్సిటీ మెయిల్‌ ఐడీతోగానీ లేదా ఏదైనా కంపెనీ మెయిల్‌ ఐడీతో గానీ మాత్రమే ఇందులో రిజిస్టర్‌ చేసుకోవడం సాధ్యపడేది. ప్రస్తుతం దీన్ని ఓపెన్‌ చేశారు. ఎవరయినా ఇందులో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా కంపెనీల, యూనివర్శిటీల నెట్వర్కులలో భాగా కావాలంటే మాత్రం సంబంధిత మెయిల్‌ ఐడీలు వుండాల్సిందే. గత సంవత్సరం యాహూ సంస్థ దీన్ని ఒక బిలియన్‌ డాలర్లకు దీన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడినా దీన్ని అమ్యేందుకు ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ సిద్ధపడలేదు. అంతేకాకుండా భారతీయ భాషల్లో కూడా దీన్నివాడుకునేందుకు వీలు కల్పించారు. ఇప్పటివరకూ ఈ నెట్వర్కింగ్‌ సర్వీసులో ఆర్కుట్‌దే పైచేయిగా వుంది. ఫేస్‌బుక్‌ భారతీయ భాషల్లో కూడా లభ్యం కావడంతో ఆర్కుట్‌ ఎదుర్కోగలుగుతుందని విశ్లేషకుల అంచనా.
మై స్పేస్‌ :
న్యూస్‌ కార్పొరేషన్‌ సంస్థకు చెందిన ఈ సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్‌ ఇప్పుడు అతి పెద్దది. ఇందులో మిలియన్ల కొద్ది జనాలు రిజిస్టర్‌ అయివున్నారు. మ్యూజిక్‌, వీడియోలు వంటి తమ అభిరుచులను ఇతరులతో పంచుకోవచ్చు. తమ కోసం ఓ పేజీ సృష్టించుకొని వారివారి విశిష్టతను ప్రపంచానికి చోటుకోవచ్చు, విభిన్న అభిప్రాయాలను, ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవచ్చు. ప్రస్తుతం దీని ప్రాముఖ్యత ఎంతగా వుందంటే- అమెరికాలో సెనెటర్లు, రాజకీయనాయకులు, సినీస్టార్లు, ఆటగాళ్ళు దీనిలో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకొని వారి వారి ఫ్రెండ్స్‌ లిస్ట్‌ ద్వారా తమ పాపులారిటీని చాటుకుంటున్నారు. రాజకీయ నాయకుల పాపులారిటీకి ఇదికూడా ఒక కొలబద్దగా తయారయ్యింది.అంతేకాకుండా తనకే సొంతంగా ఓ వీడియో ఫీచర్‌ని క్రియేట్‌ చేసుకొని యూజర్లకు వేరే సైట్ల అవసరం లేకుండా చేసుకుంది. తద్వారా ఇతర వీడియో, ఫొటో వెబ్‌సైట్ల ట్రాఫిక్‌ని కూడా కంట్రోల్‌ చేసే స్థాయికి ఇది చేరింది.
ట్విట్టర్‌ :
కేవలం 140 పదాలతోనే సమాచార విప్లవానికి తెరతీసి దూసుకెళుతోంది. హాలీవుడ్‌ స్టార్ల నుండి రాజకీయ నాయకుల వరకూ అనేకమంది ట్విట్టర్‌ వినియోగదారులే. బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం ట్విట్టర్‌ వినియోగదారులే. మొన్నమొన్నటివరకూ బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌ను ట్విట్టర్‌ క్వీన్‌గా చెప్పేవారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ప్రియాంకచోప్రా 71,026 మంది ఫాలోయర్స్‌తో నెంబర్‌ వన్‌ కిరీటం దక్కించుకుంది. ఇలాంటి సంచలనాలకు వేదికైన ట్విట్టర్‌ పుట్టుక కూడా విచిత్రంగానే మొదలైంది. ఎస్సెమ్మెస్‌ల ఆధారంగా కొత్త సోషల్‌ నెట్వర్కింగ్‌ బ్లాగ్‌ క్రియేట్‌ చేయాలని జాక్‌ డోర్సీ ఆలోచన ఫలితంగా 2006లో ఇది పుట్టింది. 'టెక్‌ క్రంచ్‌' అనే సంస్థ అంచనా ప్రకారం ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ 1.54బిలియన్‌ డాలర్లు. ''ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు మెచ్చిన ఏకైక సోషల్‌ నెట్వర్కింగ్‌ బ్లాగ్‌ ఇదే' అంటూ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ట్విట్టర్‌కు కితాబిచ్చింది. సందేశాలను పంపుకోవడంతోపాటు బ్లాగులు, వెబ్‌సైట్లను కొత్త టపా వేసిన ప్రతిసారీ ట్విట్టర్‌లో ప్రకటించొచ్చు. ఈ విధంగా ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడర్లకి తరుణోపాయంలా పనిచేస్తుంది.
యాహూ :
ఇప్పుడు యాహూ కూడా సోషల్‌ నెట్వర్కింగ్‌ క్షేత్రంలోకి అడుగుపెట్టనుంది. యాహూకు చెందిన అని సైట్లలో ఇప్పుడు ఫేస్‌బుక్‌, మైస్పేస్‌ లాంటి సోషల్‌ నెట్వర్కింగ్‌లకు చెందిన ఫీచర్స్‌ లభ్యమవు తున్నాయి. యాహూ వినియోగదారులు ఫేస్‌బుక్‌ను ఉపయోగించకుండా తమ స్నేహితులతో నేరుగా మాట్లాడు కోవచ్చు. ఫేస్‌బుక్‌ త్వరలోనే యాహూ సైట్లోకి రానుంది.
వీటితోపాటు లింక్‌డిన్‌, డిగ్‌ వంటివి అనేకం వున్నాయి. ఇవన్నీ కూడా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాయి, తెస్తున్నాయి. అన్నిటి పరమార్థం ఒక్కటే...ఆన్‌లైన్‌లో మిత్రులతో పిచ్చాపాటి.
ఉపయోగాలు :
ఇంటర్నెట్‌ వల్ల సమకూరే సదుపాయాలన్నింటినీ వినియోగించుకునే విధంగా ఈ సోషల్‌ నెట్వర్కింగ్‌ సర్వీసులు, బ్లాగ్‌లు పనిచేస్తున్నాయి. ఖండాంతరాలను దర్శించడంతో, రకరకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. తమ నెట్‌వర్క్‌ పరిధిని విస్తరించుకోవచ్చు. ఇతరులతో అభిప్రాయాలను, అనుభవాలనూ పంచుకోవచ్చు. తమ వ్యాపార లావాదేవీలను నడపవచ్చు. ఒకరకంగా ఇదో విజ్ఞాన భాండాగారం. ఎక్కడో గ్రామంలోనో, స్కూల్లోనో చదువుకున్న తమ చిన్ననాటి నేస్తాలను కలుసుకోవడం, ఈ బిజీ జీవితంలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఏర్పడి కొంతకాలం ఎక్కడున్నామో తెలియని వారిని సైతం కలిపే వారధులుగా ఇవి పనిచేస్తున్నాయి. వారు చదివిన స్కూలు పేరుతోనే ఊరు పేరుతోనో ఓ కమ్యూనిటీ క్రియేట్‌ చేసుకోని తమ అనుభవాలు, జ్ఞాపకాలు అందులో పొందుపర్చడం ద్వారా ఒకరికొకరు దగ్గరకావడం, స్నేహాన్ని పునరుద్ధరించుకోవడంతోపాటు కొత్త మిత్రులను పొందవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సంబంధాల వల్ల జీవన బాంధవ్యాలు ముడిపడుతున్నాయి. ఆన్‌లైన్‌ సంబంధాలు కేవలం సరదాకో, సమాచారానికో మాత్రమే కాదు, చదువులోనూ, కెరీర్‌లోనూ ఎదగడానికి, సామాజిక విజ్ఞానం పెంపొందింపచేసుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నెట్వర్క్‌లలోనే అనేక అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
నష్టాలు :
సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి అనేది నాణేనికి రెండువైపు కూడా వుంది. ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినా దాని మనం ఉపయోగించుకునే తీరునుబట్టి ఫలితాలు ఆధారపడి వుంటాయి. ఇంటర్నెట్‌ ద్వారా ఎంత మంచి జరగడానికి అవకాశం వుందో... అంతేస్థాయిలో చెడు జరగడానికి కూడా అవకాశం వుంది. స్నేహం పేరుతో పరిచయాలు పెంచుకొని నష్టపోతున్న వారూ వున్నారు. ప్రేమపేరుతో వంచనకు గురవుతున్న సందర్భాలు అనేకం. అందుకే ఎక్కుమంది మారుపేరుతోనో, నిక్‌ నేమ్‌లతోనో ఐడీలను క్రియేట్‌ చేసుకొంటుంటారు. చెడు సంస్కృతి, ఉన్మాదాలవైపు ప్రేరేపించే విధంగాను, అవాస్తవాలకు, అభూత కల్పనలకు ఆకర్షితులై హాని కొనితెచ్చుకుంటున్న సందర్భాలూ కోకొల్లలు. ముఖ్యంగా అశ్లీల సాహిత్యానికీ, వెర్రెక్కించే ఉన్మాద, ఆథ్యాత్మిక సాహిత్యానికీ, ఇతరులకు ఇబ్బంది కలిగించే ఛాటింగ్‌లకూ దూరంగా వుండాలి. పిల్లలు ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్లయితే.. దేనికోసం ఉపయోగి స్తున్నారో గమనించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై వుంది. ఎందుకంటే టీనేజర్లను మోసం చేసేవాళ్ళు కూడా వీటిని ఆసరా చేసుకుంటున్నారు. విదేశాలలో అయితే పేరెంటల్‌ కంట్రోల్‌ కోసం సాఫ్ట్‌వేర్‌లకు మంచి గిరాకీ వుండా వుంది. మరో కోణంలో చూస్తే- గంటల కొద్దీ వెబ్‌సైట్ల వీక్షణకు అలవాటుపడినవారు క్యాన్సర్‌కు దగ్గరవుతారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. తరచుగా ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌, మైస్పేస్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను సందర్శించేవారు ఒక్క క్యాన్సర్‌కే కాకుండా పలురకాల గుండె జబ్బులకు, మానసిక వ్యాధులకు గురవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రముఖ మానసిక నిపుణుడు ఎరిక్‌సిగ్మన్‌ మాట్లాడుతూ- 'స్నేహితులను, బంధువులను నేరుగా కలుసుకోకుండా ఇమెయిల్స్‌ ద్వారానో, సోషల్‌ నెట్వర్క్‌ల ద్వారానో, ఛాటింగ్‌ ద్వారానో మాత్రమే సంబంధాలు కలిగివుండడం.. వారి వారి జీవనవిధానంపై తీవ్ర ప్రభావం చూపుతుంద'ంటున్నారు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా వుండడం వల్ల మానవుల్లో జన్యుమార్పులకు కారణమవుతుందని సిగ్మన్‌ చెపుతున్నారు. రోగనిరోధక శక్తి తగ్గడం, శరీరంలో హార్మోన్ల విడుదలపై కూడా ప్రభావం చూపుతుందని, సోషల్‌ నెట్వర్కులపై ఎక్కువకాలం గడిపేవారి మెదడుపైకూడా ప్రభావం చూపుతుందని సిగ్మన్‌ చెపుతున్నారు.
ఇంటర్నెట్‌ అంటే మంచీ-చెడూ, లాభం-నష్టం కలగలిసిన విజ్ఞాన సర్వస్వం. దీన్ని ఏరకంగా ఉపయోగించుకుంటే ఆ రకమైన ఫలితాలే వస్తాయి. ప్రజా జీవితంలో సాంకేతిక విజ్ఞానం మమేకమైన ప్రస్తుత తరుణంలో ఈ విజ్ఞాన సర్వస్వం అభివృద్ధివైపే పయనించాలని కోరుకుందాం.
- రాజు కె ఎక్స్

తెలుగుబాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన శ్రీకృష్ణ దేవరాయలు : పురంధరేశ్వరి

భాషాబేధాలను అధిగమించి తెలుగు భాషాభివృధ్ధికి, జాతి సమైక్యతకు కృషి చేసిన చక్రవర్తి కృష్ణదేవరాయలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ధి మహౌత్సవాలు ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను పురంధరేశ్వరి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు అవనిగడ్డ శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పురంధరేశ్వరి ప్రసంగించారు. దేవరాయులు 20 ఏళ్ళపాటు రాజ్యాన్ని పాలించినా 20 యుగాలకు సరిపడా మహౌత్తర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అందుకనే శ్రీకృష్ణదేవరాయుల పేరు చెప్పగానే ఆంధ్రులు పులకరిస్తారన్నారు. దేవరాయల స్ఫూర్తికి చిహ్నంగా ఉన్న చారిత్రక కట్టాడాలు, శిథిలావస్థలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఆ కట్టడాలను పదిల పరచటానికి చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తిచేశారు. కృష్ణదేవరాయల ధైర్యాన్ని, కీర్తిని తమ తండ్రి మాజీ ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు నుంచి తెలుసుకున్నామన్నారు. ఈసందర్భంగా మంత్రి తన తండ్రి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కొసులు పార్ధసారధి మాట్లాడుతూ తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని, ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ తెలుగు భాషను మరచిపోరాదన్నారు. శ్రీకృష్ణదేవరాయులు భాషాభివృద్ధితోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. భాషా సంస్కృతి, సాహిత్యాల పట్లనే కాక సామాజిక స్పృహను కూడా ప్రదర్శించారని, ఇందుకు ఆముక్తమాల్యద రచనలోని మాలదాసు ప్రస్తావన ఉదహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.యస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ దేవరాయులు వ్యవసాయరంగ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన పాలించిన ప్రాంతాల్లో వందల చెరువులు తవ్వించి లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారన్నారు. ఇప్పటికీ కొన్ని చెరువులు ఉన్నాయని వాటిని ఉపాధి పధకం కింద పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళంలో దేవరాయులపై మ్యూజియంను ఏర్పాటుచేయాలని, దీనికి తన ఎమ్మెల్సీ నుంచి రూ.5లక్షలు విడుదలక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి అన్ని రంగాల్లో విశేష కృషి చేసిన దేవరాయులు పరిపాలన అందరికీ ఆదర్శవంతమైందని కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయులు రూపం ఎవరికీ తెలియనప్పటికీ ఆ రూపాన్ని కీర్తిశేషులు నందమూరి తారకరామారావు ద్వారా చూడగలిగామని పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి, శ్రీకృష్ణదేవరాయల ఉత్సవ రాష్ట్ర కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం తెలుగు భాష ఔన్నత్యానికి స్ఫూర్తినిచ్చిన గ్రామంగా పేరు గడించిందన్నారు. దేవరాయులు స్పష్టమైన సాంస్కృతిక విధానానికి శ్రీకాకురం చుట్టారన్నారు. దేవరాయుల పేరుమీద ఒక మండపం నిర్మించాలని పురావస్తు ప్రదర్శనశాలను, కళ్యాణ మంటపాన్ని టిటిడి వారు ఏర్పాటుచేయాలని అందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు అంబటి బ్రాహ్మణయ్య మాట్లాడుతూ సాహిత్యంలోనూ, యుద్ధవిద్యల్లోనూ నైపుణ్యం కలిగిన దేవరాయులు పట్టాభిషేక మహౌత్సవాలను శ్రీకాకుళంలో ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. తొలుత పట్టాభిషేక మహౌత్సవాల జిల్లా కన్వీనర్‌, జిల్లా కలెక్టర్‌ పియూష్‌కుమార్‌ స్వాగతోపన్యాసం చేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు పురంధరేశ్వరి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్‌ రత్నబిందు, శాసన సభ్యులు మల్లాది విష్ణు, దిరిశం పద్మజ్యోతి, డి.వై.దాస్‌, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి కృష్ణారావు, రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ చల్లప్ప, జిల్లా ఎస్పీ హరికుమార్‌, జెసి గౌరవ్‌ఉప్పల్‌, ఎంపీపీ తుమ్మల వరలకీë, జడ్పీటీసీ సభ్యులు లోయ నాగశ్రీనివాసరావు, సర్పంచ్‌ కనగాల బాబు, ఎంపీటీసీ సభ్యులు స్టాలిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Thursday, May 27, 2010

తెలుగుతేజం జిలుగులు

ఐఐటీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విజయభేరి మోగించింది. జాతీయ స్థాయిలో సార్వత్రిక విభాగంలో మొదటి ర్యాంకుతోపాటు మొదటి 10 ర్యాంకుల్లో ఏడు మనకే దక్కాయి. వికలాంగుల, ఓబీసీ విభాగాల్లోనూ జాతీయ మొదటి ర్యాంకులను మన రాష్ట్రమే సొంతం చేసుకుంది. మొత్తం 1500మంది దాకా మన రాష్ట్రం నుంచి ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశముందని అంటున్నారు. సార్వత్రిక విభాగంలో వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన అనుముల జితేందర్‌రెడ్డి జాతీయ స్థాయిలో

Sunday, May 23, 2010

మూగబోయిన మానసవీణ

తెలుగు ప్రజలను 38ఏళ్ల పాటు అలరించిన మానసవీణ మూగబోయింది. 'మానసవీణ మధుగీతం...' అంటూ ఉర్రూతలూగించిన ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి హైదరాబాద్‌లో శనివారం రాత్రి తొమ్మిది గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. వేటూరికి భార్య సీతామహాలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల కిందట గ్యాస్ట్రిక్‌ సమస్య అంటూ ఏషియన్‌ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి ఇతర సమస్యలున్నాయని చెప్పడంతో శుక్రవారం రాత్రి కేర్‌ ఆసుపత్రిలో చేరారు. వూపిరితిత్తుల్లో తీవ్రంగా రక్తస్రావం జరగడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు.

వేటూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి. ప్రముఖ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి సోదరుడి కుమారుడు సుందరరామమూర్తి. 1950లో ఆయన మద్రాసు గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కళాశాలలో

Monday, May 3, 2010

ఎలర్జీ పోగొట్టే ఉసిరి పొడి

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఎలర్జీ సులభంగా సోకుతుంది. ఫలితంగా తుమ్ములు, జలుబు వస్తాయి. ఇటువంటి ఇబ్బంది కలవారు ప్రతిరోజూ పరగడుపున ఉసిరిపొడి లేదా రసం తీసుకుంటే సమస్య దరిచేరదు. ఉదయంపూట ఐదారు తులసి ఆకులు నమిలి మింగటం కూడా మంచిదే.

ఒక స్పూన్ శొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు తగ్గుతాయి. అరగ్లాసు నీళ్లలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి ఆపైన చల్లార్చి తాగాలి.

అరగ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్లు వేసి మరిగించి అవి సగం అయ్యేవరకూ వేడి చేసి ఆపైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్ధతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి.

"లో బీపీ" ని తగ్గించే బీట్‌రూట్

శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని హైపోటెన్షన్ తగ్గిస్తుంది. దీన్నే "లో బీపీ" అంటారు. వారం రోజులపాటు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చి బీట్‌రూట్ రసం తాగితే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించవచ్చు. దానిమ్మ రసం కూడా రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది.

అలాగే వారం రోజులపాటు తాజా పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే బీపీ క్రమబద్ధం కావటంతోపాటు శారీరక వ్యవస్థ మొత్తం శక్తివంతం అవుతుంది. అయితే రోజుకు మూడుసార్లూ తాజా పండ్లనే తీసుకోవాలి. ఐదు గంటల వ్యవధిలో పూర్తిస్థాయి భోజనానికి సరిపడే మోతాదులో పండ్లను తినాలి.

ఆ తరువాత రెండు లేదా మూడు వారాలపాటు పండ్లతోపాటు పాలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత పండ్లను కొంత తగ్గించి.. గింజలు, చిరుధాన్యాలు, పచ్చికూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయటంవల్ల లో బీపీ సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇలా మూడు నెలలకొకమారు "కోర్స్ ఫుడ్‌హ్యాబిట్"ను పాటిస్తుంటే ఆరోగ్యానికి కూడా మంచిది.

రక్తపోటును తగ్గించేందుకు మంచి మందు...ఎర్రగా నిగనిగలాడే టొమోటోలు

ఎర్రగా నిగనిగలాడే టొమోటోలలోంచి తీసిన పదార్థం రక్తపోటును తగ్గించేందుకు మంచి మందుగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలద్వారా తెలుస్తోంది. విటమిన్లు, మినరల్స్ లాంటి సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్న టొమోటోలు.. రక్తాన్ని వృద్ధి చేసేందుకు మాత్రమే కాకుండా, రక్తపోటును తగ్గించటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

హైపర్ టెన్షన్‌ వ్యాధితో బాధపడుతున్న పలువురు రోగులపై జరిపిన ఓ అధ్యయనంలో.. టొమోటోలలోని లైకోపీన్ నుంచి తయారు చేసిన లైకోమాటో అనే సప్లిమెంట్లు రక్తపోటు నివారణకు అద్భుతమైన మందుగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా సిస్టోలిక్ ప్రెషర్ 120-140 లోపు, డయాస్టోలిక్ ప్రెషర్ 80-90 లోపు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్‌ ఉన్నట్లుగా పరిగణించాల్సి ఉంటుంది.

అయితే లైకోపీన్‌ నుంచి తయారు చేసిన లైకోమాటో హైపర్‌ టెన్షన్‌తో బాధపడే రోగులకు ఇవ్వగానే వారిలో సిస్టోలిక్ ప్రెషర్ 10 పాయింట్లు, డయాస్టోలిక్ ప్రెషర్ 4 పాయింట్ల మేరకు తగ్గినట్లు పరిశోధకులు గమనించారు.

ఇదిలా ఉంటే.. టొమోటోలలో ఎన్నో రకాల పోషకాలున్నప్పటికీ.. లైకోపీన్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయటమే గాకుండా.. గుండెకు చేటు చేసే ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గతంలో ఎన్నో పరిశోధనలు పై విషయాలను నిర్ధారించినా, ఇప్పుడు తాజాగా టొమోటోల్లోని ఈ లైకోపీన్‌కు రక్తపోటును కూడా తగ్గించే గుణం ఉన్నట్లు తేటతెల్లమైంది. కాబట్టి.. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలుచేసే ఎర్రాని టొమోటోపండ్లను ఎంచక్కా లాగింసి.. బీపీని అదుపులో పెట్టుకుంటారు కదూ..?!