....

Footer Right Content

Saturday, September 4, 2010

పిఆర్పీ ఆధ్వర్యంలో ‘‘న్యూస్ బులిటెన్’’

ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ‘‘న్యూస్ బులిటెన్’’ వెలువడనుంది. దీన్ని 15రోజులకొకసారి పక్షపత్రికగా తీసుకొస్తారు. దీనిలో ప్రజారాజ్యం పార్టీ వార్తలతోపాటు ఆ పార్టీపై వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యంపై వచ్చే విమర్శలకు వీరి కౌంటర్స్ గానీ, ప్రభుత్వ విధానాలపై వీరి విమర్శలకు ఇతర పత్రికల్లోనూ, చానళ్ళలోనూ చోటు దొరకడం లేదని పాపం వారు ఆవేదన చెందుతున్నారు.  పర్యవసానంగా మరో  ‘‘సొంత’’ పత్రిక ప్రజల సహనాన్ని పరీక్షించనుంది

1 comment:

  1. సాక్షి లాగా చానల్ పెట్టేస్తే సరి... " మా" ఉందిగా

    ReplyDelete