....

Footer Right Content

Thursday, September 30, 2010

మూఢ విశ్వాసాల నీడనే గిరిజనం

ఆధునిక యుగంలోనూ గిరిజనులు మూఢ విశ్వాసాల నీడనే బతుకుతున్నారు. వారిలో చైతన్యం నింపాల్సిన అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. పాముకాటుకు మంత్రం, తేలు కుడితే నాటు వైద్యం జ్వరం వస్తే తాయత్తు వంటివి గ్రామాల్లో నేటికీ చెలామణీలో వున్నాయి.  దీని ఆధారంగా నాటు వైద్యులలు బతికేస్తున్నారు. మూఢ నమ్మకాల ముసుగులో పడి అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతినిత్యం గిరిజన ప్రాంతాల్లోనేకాక మారుమూల పల్లెల్లో కూడా చోటు చేసుకుంటూనేవున్నాయి. అధికారులు వారిలో చైతన్యం నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు, ప్రభుత్వ పథకాలు శూన్యం. ఎన్ని స్వాతంత్య్రదినోత్సవాలు జరుపుకున్నా.... వీరి బ్రతుకులు మారవు. అంతేకాకుండా  గిరిజన తండాల్లో ఆడపిల్లల విక్రయాలు, భౄణహత్యలు, చేతబడులు, నాటువైద్యం, మంత్ర తంత్రాలు నిత్యం చోటుచేసు కుంటూనే వున్నాయి. దీనికి ప్రధాన కారణం- పేదరికం, నిరక్షరాస్యత.  గిరిజనుల్లో చైతన్యం లేకపోవడం వల్ల వారు ఆడ పిల్లలను విక్రయించడం, లేదా  పురిటిలోనే పీకపిసికి చంపేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతూనే వున్నాయి.
గిరిజన తండాల్లో అభివృద్ధికి ఆమడదూరంలో జీవితాలను వెల్లబుచ్చుతున్న వీరిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరి అభివృద్ధికోసం నిస్వార్థంగా కృషిచేయాలి. అప్పుడే వీరి జీవితాలలో వెలుగులు నిండుతాయి.

Monday, September 27, 2010

ఇబుక్ కి మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?

మిత్రులారా,
ఇపుస్తకానికి (eBook), మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?
ఇబుక్ చదివినదానికి, మామూలు పుస్తకం చదివినదానికి తేడా ఏమిటి?
ఎలాంటి అనుభూతి కలుగుతుంది?
ప్రస్తుతం లేటెస్ట్ ఇబుక్స్ వివరాలను బ్లాగర్ మిత్రులు తెలపవలసిందిగా  కోరుతున్నాను.

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యవరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టును నాటి పర్యవరణం పరిరక్షణ కోసం పాటు పడాలి.  మన  పరిసరాలను మనమే కాపాడుకోవాలి.  రోజురోజుకు వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దానిలో బాగంగా గ్రేన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ లాంటివి పడకుండా, ఓజోన్‌ పొర దెబ్బతిన కుండా ఉండాలంటే ఇలాంటి కార్య క్రమాలు చేపట్టాలి. ప్రతి జీవికి ప్రాణవాయువు ఆక్సిజన్‌ ఎంతో ముఖ్యం. దాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.  ప్రతి ఇంటి ముందూ చెట్లు నాటి పర్యవరణ పరిరక్షణకు దోహదం చేయాలి.

Tuesday, September 21, 2010

యుగపురుషుడు మన గురజాడ

నేడు గురజాడ అప్పారావు 148వ జయంతి

అంధయుగం మీద ఉషస్సులా జ్వలించే శక్తిని అక్షరంలో నిక్షిప్తం చేసిన యుగపురుషుడాయన.
సామాజిక వికృతిని ప్రతిబింబించే అద్దంలా మారే విద్యను అక్షరానికి నేర్పినవాడాయన.
ఆయనే గురజాడ వేంకట అప్పారావు గారు. మధురవాణి అనే వేశ్యారత్నం ఈ క ళింగ దేశంలో పుట్టకపోతే ఎంత లోపం జరిగేదో కదా! అంటాడు ‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకశాస్ర్తి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గురజాడ అనే మహా రచయిత తెలుగునాట పుట్టకపోతే ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప శూన్యం ఆవహించేది.

Thursday, September 16, 2010

దీనికి బాధ్యులెవరు...?

రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన జరిగినా ముఖ్యంగా ఆ ప్రభావం బస్సులపై  పడుతోంది. కనిపించిన బస్సులపై వారు ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ప్రజలపైనే భారాలు మోపుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు...  రాష్ట్రంలో ఏ ఆందోళన, బంద్ జరిగినా అందరి ప్రతాపం బస్సులపైనే.  గతంలో ఆర్టీసీ అధికారులు 'నేనేం పాపం చేశాను' అంటూ బస్సు ప్రశ్నిస్తున్నట్లుగా మంటల్లో దగ్ధమైన బస్సులను ప్రదర్శనకు పెట్టినప్పటికీ

Wednesday, September 15, 2010

అద‏రగొట్టిన 'మగధీర'


జాతీయస్థాయిలో వెండితెర అవార్డుల జాబితా వెలువడింది. సినీ అవార్డుల పండుగలో కేరళ తారలు మరోమారు వెలిగాయి. వైవిధ్యం బాటలో నడుస్తూ ప్రేక్షకుల గుండెను తాకుతున్న బాలీవుడ్ అత్యధిక అవార్డులు అందుకుని విజయ పతాక ఎగురవేసింది.  మలయాళం, హిందీ చిత్రాలు పోటాపోటీగా అవార్డులు సాధించాయి.  తెలుగు సినిమాకూ రెండు అవార్డులు లభించాయి.

79 ఏళ్ల తెలుగు సినిమా

మనిషిని అత్యంత ప్రభావితం చేసిన అంశాల్లో సినిమా ఒకటి.  భాషా, ప్రాంతం... అనే ఎల్లలు లేనిది సినిమా. అసలు ఈ సినిమా  పదం 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. 'పురోగమనంలో ముందుకు పోవడం' అనేది దీని అర్థం. నాడు కదిలిన బొమ్మ, నేడు ఆధునికపు హంగులతో వేగంగా పరుగెడుతోంది. ఎన్నో వింతలు, విశేషాలు, విప్లవాలు మానవ సమాజంలో చోటుచేసుకోవడానికి కారణమైన ఈ కదిలేబొమ్మ తెలుగువారికి పరిచయమై నేటికి 79 సంవత్సరాలు.

ఈ సందర్భంగా సినిమా గురించి...1913లో తొలిభారతీయ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'ను దాదాసాహెబ్‌ ఫాల్కే తీశారు. ఇది మూకీ చిత్రం. అంటే తెరపై బొమ్మలు మాత్రమే కదులుతాయి. నటుల హావభావాలతోనే సినిమా కథను

Sunday, September 12, 2010

శ్రీకృష్ణదేవరాయలు తెలుగోడు కాదా?

కాదనే అంటున్నారు కేంద్ర మానవ వనరులశాఖా మంత్రి డి.పురంధేశ్వరి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడే కాదని, ఆయన భార్యలు, రాజ్యాభిషేకం అంశాలోనూ పలు సందేహాలు ఉన్నాయని  మంత్రి పురంధేశ్వరి వివాదస్పద
వ్యాఖ్యాలు చేశారు. రవీంద్రభారతిలో శనివారం కెఆర్‌కెఎం మెమోరియల్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో రైతురాయల స్వర్ణచరితం సంగీత నృత్య రూపకం ప్రదర్శితమైంది. రూపకాన్ని ఆధ్యంతం తిలకించిన అనంతరం సభ
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పురంధేశ్వరి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, లోక్‌సత్తాపార్టీ స్థాపక అధ్యక్షులు జయప్రకాశ్‌నారయణ పాల్గొన్నారు. 

తెలుగు సాహితీసంపద

తెలుగు సాహితీసంపదను ఒకేచోట గుదిగుచ్చి  సాహితీప్రియులకు జాలంలో విందు నేర్పాటుచేసింది

Sunday, September 5, 2010

హైదరాబాద్ హలీంకు అరుదైన గౌరవం


హైదరాబాద్ హలీంకు ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కింది. హలీం పేటెం ట్ కోసం కొన్నేళ్లుగా చేస్తున్న శ్రమకు ఫలితం లభించింది. రంజాన్ మాసంలోనే పేటెంట్ దక్కడం హలీం ప్రియులను ఆనందంలో ముంచెత్తింది. కేంద్ర ప్రభుత్వ జా గ్రఫికల్ ఇండికేషన్స్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని గ్రాండ్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో పేటెంట్ సర్టిఫికెట్ ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చే సిన పేటెంట్ కంట్రోలర్ జనరల్ పీహెచ్. కురియన్ చేతుల మీదుగా హలీం మేకర్స్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు

Saturday, September 4, 2010

యువతను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే

* నేడు ఉపాధ్యాయ దినోత్సవం
రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన యువతను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత నేటి ఉపాధ్యాయులపైనే ఉంది.  మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, సహనంతో విజయాలు సాధించడం గురుపూజోత్సవ వైభవాన్ని, విశిష్టతను  తెలియజేస్తుంది.  నేటి సమాజంలో విలువలు, క్రమశిక్షణ లోపించి గురువులపైనే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కొందరు ప్రజానాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు.  ఆవేశంతో రెచ్చగొట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో యువత భవిష్యత్తును పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.

అదే సమయంలో  ఈమధ్యకాలంలో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన సమాజానికి తలవంపులుగా మారింది.  విద్యార్థుల తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్టకరం. రోజూ పత్రికల్లో ఉపాధ్యాయుల గురించిన ఏవో సంఘటనలు కనిపిస్తూనే వుంటాయి. ఇది సభ్యసమాజానికి తలవంపులు. ఏదేమైనప్పటికీ  నేటి సమాజంలో ఉన్నత విలువలను, విశిష్టతను కాపాడాల్సిన గురుత బాధ్యత గురువులపైనే వుంది.

విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలో ఉధృతంగా, తెలంగాణాలో చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపింది. తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే

రోగాంధ్రప్రదేశ్‌ !

ఆంధ్రప్రదేశ్‌ రోగాల ముసురుతో జబ్బుపడింది. ప్రాణాలతో పరిహాసమాడే పాలకుల నిర్లక్ష్యం వల్ల అటు ఆదిలాబాద్‌ నుంచి అనంతపురం దాకా, ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ మహమ్మారి వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగ్యూ సెరిబ్రియల్‌ మలేరియా తదితర వ్యాధులతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఆగస్టు నెలలో వందమందికిపైగా, ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 20 రోజుల్లో 50 మంది మృత్యువాత పడ్డారంటే జబ్బుల తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. గత రెండునెలల్లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు

పిఆర్పీ ఆధ్వర్యంలో ‘‘న్యూస్ బులిటెన్’’

ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ‘‘న్యూస్ బులిటెన్’’ వెలువడనుంది. దీన్ని 15రోజులకొకసారి పక్షపత్రికగా తీసుకొస్తారు. దీనిలో ప్రజారాజ్యం పార్టీ వార్తలతోపాటు ఆ పార్టీపై వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యంపై వచ్చే విమర్శలకు వీరి కౌంటర్స్ గానీ, ప్రభుత్వ విధానాలపై వీరి విమర్శలకు ఇతర పత్రికల్లోనూ, చానళ్ళలోనూ చోటు దొరకడం లేదని పాపం వారు ఆవేదన చెందుతున్నారు.  పర్యవసానంగా మరో  ‘‘సొంత’’ పత్రిక ప్రజల సహనాన్ని పరీక్షించనుంది

నేను సైతం...


మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ....


నేటి భారతం - అర్థరాత్రి స్వతంత్రం


నేటి భారతం - భారతమాతా నీ బంధాలను తెంచేస్తాము


Thursday, September 2, 2010

తెలుగు జాతి మనది... నిండుగ వెలుగుజాతి మనది...


రాజువయ్యా... మహరాజువయ్యా...



పాడనా తెనుగు పాట... పరవశమై



కృషివుంటే మనుషులు రుషులవుతారు...



పుణ్యభూమి నాదేశం నమో నమామి...




తెలుగువీర లేవరా... దీక్షబూనిసాగరా...




కరుణశ్రీ ‘‘పుష్పవిలాపం’’



నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడు తున్నది. పూల బాలలు తల్లి వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు,

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

ఒక సన్నజాజి కన్నియ తన సన్నని గొంతుకతో నన్ను జూచి ఇలా అన్నది ప్రభూ.
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

ఎందుకయ్యా మా స్వేచ్ఛభిమానాని కడ్డు వస్తావ్? మేం నీకేం అపకారం చేశాం?
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో,
తాళుము, త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఇంతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా ఎర్రజేసుకుని ఇలా అన్నది ప్రభూ.
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

పాపం, మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు గాబోలునే !
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

ఓయి మానవుడా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నా హృదయకుసుమాన్ని గైకొని
నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరించుము ప్రభూ!

గురజాడ అప్పారావు ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’

మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీ కథను ?
ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?
కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజలు పువ్వులు కోసేది.
ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.
కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.
ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో;
కిలకిల పలికెను కీరములు.
ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుక్కించె
కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను;
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.
పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ;
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.
పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ;
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !
చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.
"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.
"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ
నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి;
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."
బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.
యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.
ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు వొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.
చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.
కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.

తెలుగు శంఖారావం


రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు,
సంగీతం, గానం : డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ

శ్మశానాలనూ వదలరా?

ఇక శ్మశానాలకూ ప్రైవేటు చావొచ్చిపడింది. తొలుత ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) పరిధిలో అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని శ్మశానాలనూ వ్యక్తులకూ, సంస్థలకూ ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో 10 వేల మంది కాటికాపరుల కుటుంబాలు వీధిన పడను న్నాయి. ఇన్నాళ్లూ శ్మశానాలను నమ్ముకొని బతుకుతున్న వారిని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థల పెత్తనానికి శ్మశానాలను వదిలేందుకు

శ్రీశ్రీ - మహాప్రస్థానం

శ్రీశ్రీ - మహాప్రస్థానం 
http://www.ziddu.com/download/11488741/Mahaprasthanam.pdf.html