....

Footer Right Content

Saturday, July 24, 2010

తెలుగుబాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన శ్రీకృష్ణ దేవరాయలు : పురంధరేశ్వరి

భాషాబేధాలను అధిగమించి తెలుగు భాషాభివృధ్ధికి, జాతి సమైక్యతకు కృషి చేసిన చక్రవర్తి కృష్ణదేవరాయలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ధి మహౌత్సవాలు ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను పురంధరేశ్వరి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు అవనిగడ్డ శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పురంధరేశ్వరి ప్రసంగించారు. దేవరాయులు 20 ఏళ్ళపాటు రాజ్యాన్ని పాలించినా 20 యుగాలకు సరిపడా మహౌత్తర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అందుకనే శ్రీకృష్ణదేవరాయుల పేరు చెప్పగానే ఆంధ్రులు పులకరిస్తారన్నారు. దేవరాయల స్ఫూర్తికి చిహ్నంగా ఉన్న చారిత్రక కట్టాడాలు, శిథిలావస్థలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఆ కట్టడాలను పదిల పరచటానికి చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తిచేశారు. కృష్ణదేవరాయల ధైర్యాన్ని, కీర్తిని తమ తండ్రి మాజీ ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు నుంచి తెలుసుకున్నామన్నారు. ఈసందర్భంగా మంత్రి తన తండ్రి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కొసులు పార్ధసారధి మాట్లాడుతూ తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని, ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ తెలుగు భాషను మరచిపోరాదన్నారు. శ్రీకృష్ణదేవరాయులు భాషాభివృద్ధితోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. భాషా సంస్కృతి, సాహిత్యాల పట్లనే కాక సామాజిక స్పృహను కూడా ప్రదర్శించారని, ఇందుకు ఆముక్తమాల్యద రచనలోని మాలదాసు ప్రస్తావన ఉదహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.యస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ దేవరాయులు వ్యవసాయరంగ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన పాలించిన ప్రాంతాల్లో వందల చెరువులు తవ్వించి లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారన్నారు. ఇప్పటికీ కొన్ని చెరువులు ఉన్నాయని వాటిని ఉపాధి పధకం కింద పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళంలో దేవరాయులపై మ్యూజియంను ఏర్పాటుచేయాలని, దీనికి తన ఎమ్మెల్సీ నుంచి రూ.5లక్షలు విడుదలక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి అన్ని రంగాల్లో విశేష కృషి చేసిన దేవరాయులు పరిపాలన అందరికీ ఆదర్శవంతమైందని కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయులు రూపం ఎవరికీ తెలియనప్పటికీ ఆ రూపాన్ని కీర్తిశేషులు నందమూరి తారకరామారావు ద్వారా చూడగలిగామని పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి, శ్రీకృష్ణదేవరాయల ఉత్సవ రాష్ట్ర కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం తెలుగు భాష ఔన్నత్యానికి స్ఫూర్తినిచ్చిన గ్రామంగా పేరు గడించిందన్నారు. దేవరాయులు స్పష్టమైన సాంస్కృతిక విధానానికి శ్రీకాకురం చుట్టారన్నారు. దేవరాయుల పేరుమీద ఒక మండపం నిర్మించాలని పురావస్తు ప్రదర్శనశాలను, కళ్యాణ మంటపాన్ని టిటిడి వారు ఏర్పాటుచేయాలని అందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు అంబటి బ్రాహ్మణయ్య మాట్లాడుతూ సాహిత్యంలోనూ, యుద్ధవిద్యల్లోనూ నైపుణ్యం కలిగిన దేవరాయులు పట్టాభిషేక మహౌత్సవాలను శ్రీకాకుళంలో ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. తొలుత పట్టాభిషేక మహౌత్సవాల జిల్లా కన్వీనర్‌, జిల్లా కలెక్టర్‌ పియూష్‌కుమార్‌ స్వాగతోపన్యాసం చేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు పురంధరేశ్వరి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్‌ రత్నబిందు, శాసన సభ్యులు మల్లాది విష్ణు, దిరిశం పద్మజ్యోతి, డి.వై.దాస్‌, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి కృష్ణారావు, రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ చల్లప్ప, జిల్లా ఎస్పీ హరికుమార్‌, జెసి గౌరవ్‌ఉప్పల్‌, ఎంపీపీ తుమ్మల వరలకీë, జడ్పీటీసీ సభ్యులు లోయ నాగశ్రీనివాసరావు, సర్పంచ్‌ కనగాల బాబు, ఎంపీటీసీ సభ్యులు స్టాలిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

3 comments:

  1. ఆ మహానుభావుడు పోయి 500ఏళ్ళయిందిలే తెలుగు బాషకు మీరేమి ఒరగబెడుతున్నారో చెప్పేడవండి!

    ReplyDelete
  2. యెందుకొచ్చిన తెలుగు తేజాలివి? తెలుగు గ్రహణాలంటే బావుంటుందేమో!

    యే పత్రికలో వచ్చిందీ రిపోర్టు?

    పు"రంధ్రే"శ్వరి తండ్రి గురించి మాట్లాడుతోందా ఇంకా?

    ReplyDelete
  3. మీరు అంత వల్గర్ గా మాట్లాడడం బాగోలేదు

    ReplyDelete